NTV WebDesk
Author- NTV Telugu-
ప్రపంచానికి జీ7 భారీ భరోసా..
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంపచంలో కరోనా మహమ్మారి తీవ్రంగా దేశాలకు బిలియన్ డోసులను అందించబోతున్నట్టు యూకే ప్రకటించింది. జీ7 లోని సభ్యదేశాలు మిగులు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందించేందుకు అంగీకరించాయని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బిలియన్ డోసుల్లో 75శాతం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవాక్స్ ద్వారా సభ్యదేశాలకు అందజేయనున్నారు. అదే విధంగా, మిగిలిన 25శాతం టీకాలను ఇతర మార్గాల్లో దేశాలకు అందజేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే పేద […] -
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు…
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. రూ.1064 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నామా నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు మళ్లించారని అభియోగాలు వచ్చాయి. నామాతో పాటుగా రాంచి ఎక్స్ప్రెస్ వే సీఎండీ శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ ఇళ్లపై కూడా ఈడీ దాడులు చేసింది. అటు 2019లో నామాపై సీబిఐ కేసు […] -
రేపు ఈటల రాజేందర్ రాజీనామా…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈనెల 14 వ తేదీన ఈటల ఢిల్లీవెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటుగా మరికొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగానే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దేవరయాంజల్ లో భూములను ఆక్రమించుకున్నారని ఈటలపై ఆరోపణలు […] -
గుడ్న్యూస్ః ఏపీ నుంచి దూరప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు…
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయం పొడిగించడంతో దూరప్రాంతాలకు ఆర్టీపి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి దూరప్రాంతాలకు సర్వీసులను ప్రారంభించారు. విజయవాడ నుంచి విశాఖ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంధ్యాలకు ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం వరకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేసింది. కరోనా కేసుల కారణంగా […] -
వీరవనితః కరోనా రోగిని వీపుపై మోసి…
కరోనా సమయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు. నేను, నా కుటుంబం బతికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో ఓ మహిళ తన వీపుపై కరోనా రోగిని ఎక్కంచుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్నది. నగోల్ నగరం సమీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో […] -
ఈ ఏడాది రథయాత్రపై కరోనా ప్రభావం…
ఒడిశాలోని పూరి రథయాత్రకు ఎంతటి చరిత్ర ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది జులై నెలలో పూరి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కానీ, గతేడాది కరోనా మహమ్మారి కారణంగా రథయాత్రను ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఏడాది సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సెకండ్వేవ్ ఉదృతి కారణంగా రథయాత్రను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించారు. రథయాత్రలో 500 లకు మించి సేవకులు పాల్గోనబోరని, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటీవ్ వచ్చిన సేవకులను మాత్రమే సేవలో పాల్గొంటారని, పోలీసు […] -
వైరల్ః హెల్మెట్ను గుటుక్కున మింగేసి…గుట్టుచప్పుడు కాకుండా…
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ […] -
తప్పిపోయిన యువతి… ఐదేళ్ల తరువాత ఇంటికి… ఎలా అంటే…
ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయింది. తప్పిపోయిన యువతి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. అయితే, అలా తప్పిపోయి యువతి ఐదేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మల లక్షీపురం మండలంలోని టిక్కబాయి గ్రామానికి చెందిన జయసుధ అనే యువతి మతిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైల్వే […] -
టీకా వేయించుకున్న వరుడు కావలెను…
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి […] -
జూన్ 11 శుక్రవారం దినఫలాలు…
మేషం : ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు […]
తాజావార్తలు
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!