NTV WebDesk
Author- NTV Telugu-
అక్కడ విజృంభిస్తున్న మార్ బర్గ్ వైరస్ …
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడంలేదు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అయితే, ఇప్పుడు గబ్బిలాల నుంచి మార్బర్గ్ అనే మరో వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ. పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్తో ఓ వ్యక్తి ఆగస్టు 2 వ తేదీన మరణించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ […] -
ప్రపంచంపై కరోనా పడగ… ఏమాత్రం తగ్గని కేసులు…
ప్రపంచంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో తిరిగి కరోనా విజృంభిస్తుండటంతో అన్నిదేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. సోమవారం రోజున యూఎస్లో ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. అమెరికాలోని ఆర్కాన్సన్ రాష్ట్రంలో అత్యధిక కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. సోమవారం రోజున ఆ రాష్ట్రంలో 1376 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇక అమెరికా తరువాత అత్యధిక కేసులు ఇరాన్లో నమోదవుతున్నాయి. సడలింపులు […] -
వైరల్: పితక్కుండానే పాలిచ్చేస్తోంది…
కలియుగంలో ఎక్కడ ఎలాంటి వింతలు జరుగుతాయో తెలియడంలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్ని వింత వింతలు జరుగుతున్నాయి. మనుషులు పాల కోసం ఆవులను పెంచుతుంటారు. కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు. కొన్ని వద్దన్నా పాలు ఇచ్చేస్తుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెషల్. ఈ ఆవు పొదుగును పితక్కపోయినా పాలు ఇచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆ ఆవు యజమాని వెంకటరమణారెడ్డి పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లాలోని వడమాల మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంకటరమణారెడ్డికి […] -
బంగ్లాలోనూ…పాక్ ఘటన…హిందూ ఆలయంపై దాడి…
బంగ్లాదేశ్లో హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయంపై దాడికి పాల్పడిన వారిగా అనుమానిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రోజున స్థానికుల మధ్య గొడవ జరిగిందని, ఆ తరువాతే దేవాలయంపై దాడులు జరిగాయని స్థానికుల […] -
ఏక్తా కపూర్ తో కరీనా కపూర్… ఏక్ థ్రిల్లర్ కహానీ!
గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఫేడవుట్ అవుతారో తెలియదు. ఒక్కోసారి 21 ఏళ్ల యంగ్ బ్యూటీ కూడా ఆఫర్స్ అందుకోలేక చతికిలపడుతుంది. కానీ, గత 21 ఏళ్లుగా కరీనా యమ స్పీడుగా దూసుకొస్తూనే ఉంది. ఇద్దరు బేబీస్ కి తల్లి అయినా ఆమెని ఇంకా బేబీ అనటానికే ఇష్టపడతారు కుర్రాళ్లు. అటువంటి ఎవర్ గ్రీన్ బేబో ఇప్పుడు మరో కొత్త బాధ్యత నెత్తిన వేసుకుంటోంది! యాక్టర్ కరీనా ప్రొడ్యూసర్ గా మారనుంది… కరీనా నిర్మాతగా తొలి చిత్రం […] -
తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 494 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,50,353కి చేరింది. ఇందులో 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8,112 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతిచెందినట్టు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఇక ఇదిలా […] -
మాస్క్ పెట్టుకున్నా… అతడిని అరెస్ట్ చేశారు… ఎందుకంటే…
మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో పాటుగా జైల్లో పెట్టారు. అదేంటి మాస్క్ ధరిస్తే జరిమానా వేయడం ఏంటి అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్ట్. మామూలు మాస్క్ ధరిస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆ వ్యక్తి భయపెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. భయపెట్టే విధంగా ఉన్న మాస్క్ ధరించి దారినపోయే వారిని భయపెడుతుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని […] -
శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు టీటీడీ చైర్మన్…
ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించింది. 2019లో తొలిసారి టీటీడీ చైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టిని వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. చైర్మన్ను మారుస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపింది. రెండోసారి పదవిని చేపట్టిన తరువాత ఆయన శ్రీవారి మెట్టుమార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. గత రెండేళ్లలో తెలియక దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలని కోరుకుంటూ కాలినకడన శ్రీవారి మెట్టు […] -
బన్సాలీకి ‘గంగూభాయ్’ బంపర్ ఆఫర్!
బాలీవుడ్ లోని హాట్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో సంజయ్ లీలా బన్సాలీ మొదటి వరుసలో ఉంటాడు. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అప్ కమింగ్ ఆర్టిస్టులే కాదు అగ్రశ్రేణి తారలు కూడా తహతహలాడుతుంటారు. మరి ఆలియా ఇందుకు మినహాయింపు ఎందుకవుతుంది? ఆమె బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘హీరా మండీ’లో ఏదో ఒక క్యారెక్టర్ తనకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం బీ-టౌన్ లో ఆలియా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పాత్ర కావాలని […] -
జూలో దారుణం: జుట్టు పట్టుకొని కొట్టుకున్న పర్యాటకులు…ఆసక్తిగా గమనించిన జంతువులు…
కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కరోనాకు కారణమైన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. పర్యాటక రంగం తిరిగి ప్రారంభమైంది. రాజధాని బీజింగ్లోని జూ వీకెండ్స్లో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రోజున పెద్దసంఖ్యలో పర్యాటకులు బీజింగ్ జూకు తరలి వచ్చారు. అయితే, జూలో ఉన్నట్టుండి ఇద్దరు పర్యాటకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రెండు కుటుంబాల మధ్య గొడవలా మారిపోయింది. రెండు కుటుంబాలకు […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!