NTV WebDesk
Author- NTV Telugu-
గుడ్ న్యూస్: దిగొస్తున్న పుత్తడి… భారీగా పతనమైన వెండి…
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా, దేశీయంగా మార్కెట్లు జోరు పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీని ప్రభావం బంగారంపై పడింది. తాజాగా తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.46,960కి […] -
ఆయన కుటుంబం సంపాదన రోజుకు వెయ్యికోట్లపైనే…
దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అని చెప్తాం. ఆయన నికర ఆస్తుల విలువ 7,18,000 కోట్లు. ప్రతిరోజు ఆయన కుటుంబం సంపాదన రూ.163 కోట్లు పెరుగుతున్నట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అయితే, దేశంలో సంపన్నుల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ఆదాని రోజువారి ఆదాయం విషయంలో ముఖేష్ అంబాని కుటుంబాన్ని దాటేశారు. ముఖేష్ అంబాని కుటుంబానికి అందనంతగా భారీగా ఆదాయన్ని పెంచుకుంటున్నారు. గౌతమ్ ఆదానీ కుటుంబం ప్రతిరోజు […] -
కాంగ్రెస్కు జీ 23 ఎఫెక్ట్: త్వరలో ఆ నిర్ణయం తీసుకోకుంటే…
పంజాబ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ రాజీనామా చేశారో అప్పటి నుంచి అంతర్గత కలహాలు బగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడంతో మరో డ్రామా నడిచింది. కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు నచ్చడం లేదని, తాన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ, […] -
అక్టోబర్ 1, శుక్రవారం దినఫలాలు
మేషం:- ఉద్యోగస్తులకు అడ్వాన్లు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్తయత్నాలు మొదలెడతలారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారిపోతాయి. వృషభం:- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే […] -
కిమ్ సోదరికి కీలక పదవి… దానికోసమేనా…!!
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా […] -
అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు: పంజాబ్ కాంగ్రెస్లో చీలిక తప్పదు
అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి పంజాబ్ చేరుకున్నారు. పంజాబ్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితిపై ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితి నెలకొందని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని కోల్పోతే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పార్టీలో సిద్ధూని అనేక మంది వ్యతిరేకిస్తున్నారని, నిలకడ లేని మనస్థత్వం కలిగిన […] -
ప్రజా ప్రతినిధుల కోర్టునుంచి వైఎస్ షర్మిలకు ఊరట…
జగన్ తల్లి వైయస్ విజయమ్మ సోదరి, షర్మిల ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఊరట లభించింది. 2012లో పరాకల లో ఏర్పాటు చేసిన సభకు అనుమతికి సంబంధించిన కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభ ఏర్పాటు చేశారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పుడు కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కొండా సురేఖ కొండా మురళి తో పాటుగా తొమ్మిది మంది పైన పోలీసులు కేసు నమోదు […] -
జైళ్లశాఖ కొత్త డీజీగా జితేందర్ నియామకం…
జైళ్లశాఖ కొత్త డీజీగా డాక్టర్ జితేందర్ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1982 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ లా అండ్ ఆర్డర్ డీజీ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జైళ్ల శాఖ డిజిగా ఉన్న రాజీవ్ త్రివేది ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జైల్ శాఖ కొత్త డీజీ గా జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. – Ramesh Vaitla Read: జియో ఫిజిక్స్ ప్రొఫెసర్కు ఆ దేశ […] -
జియో ఫిజిక్స్ ప్రొఫెసర్కు ఆ దేశ ప్రధానిగా అవకాశం…
ఎప్పుడు ఎవర్ని అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేదు. ఒక దేశానికి ప్రధాని కావడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. దేశంలోని ప్రజల అభిమానాన్ని చొరగొనాలి. పార్లమెంట్లో మెజారిటీ సాధించాలి. పార్టీలో పట్టు ఉండాలి. అయితే, ఇవేమీ లేకుండానే ఓ మహిళకు ఆ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయితే, ఆమె పరిణితి చెందిన విద్యావేత్త. జియో ఫిజిక్స్ ప్రొఫెసర్. విద్యాశాఖ తరపుల ప్రపంచబ్యాంక్ నిర్వహించిన అనేక ప్రాజెక్టుల్లో ఆమె పాలుపంచుకున్నారు. ఆమె […] -
షాపై దిగ్విజయ్ ప్రశంసలు… ఆ సహాయం ఎప్పటికి మర్చిపోను..
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపైనా, ఆర్ఎస్ఎస్ పైనా నిప్పులు చెరుగుతుంటారు. వారి మతరాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు. అయితే, సడెన్గా దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో వారు చేసిన సాయం గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల క్రితం తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు గొప్ప సాయం చేశారని […]
తాజావార్తలు
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!