NTV WebDesk
Author- NTV Telugu-
Telangana Budget Session : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షురూ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు […] -
AP Assembly Budget Session: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై […] -
SR Nagar Car Accident: వెర్ణా కారు బీభత్సం..పసిపాపకు గాయాలు
హైదరాబాద్ నడిబొడ్డు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం కలిగించింది. ఈ ఎస్ ఐ ఆసుపత్రి లైన్ నుండి వస్తున్న వెర్ణా కారు దూసుకుపోయింది. మొదట ఓ స్కూటీని ఢీ కొట్టి అదే వేగంతో మరో బైక్ ను ఢీ కొట్టింది కారు. బీకే గూడ చౌరస్తా దగ్గర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 8 నెలల పసికందుకి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి […] -
Up Elections Polling: యూపీలో ఆఖరి విడత పోలింగ్
ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు. శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్ […] -
Astrology: మార్చి 7, సోమవారం దినఫలాలు
మేషం :– ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి. వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. […] -
Bandi Sanjay: ఫాంహౌస్ నుంచి కేసీఆర్ని గళ్ళపట్టి గుంజాం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు […] -
TDP Narisankalpa Deesksha: మహిళలకు భద్రత ఏదీ?
ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ మండిపడింది. నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అసమర్థ నాయకుని పాలన ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్డంవుతుందన్నారు అనిత. వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే నారీ సంకల్ప దీక్ష చేపట్టాం అన్నారు. పాదయాత్రలో తల నిమిరి ముద్దులు పెట్టిన జగన్.. […] -
HarishRao :కంటి వెలుగు ఘనత కేసీఆర్దే
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కష్టకాలంలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ని అందించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లకోమా డే వారోత్సవాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు ప్రజలు గ్లకోమా గురించి అవగాహన కల్పించాలని మంత్రి […] -
Talasani Srinivas Yadav: మూడ్రోజుల మహిళా దినోత్సవాలు శుభపరిణామం
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు మహిళా దినోత్సవ కార్యక్రమం శుభపరిణామం అన్నారు మంత్రి తలసాని. తాగునీటి కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడేవారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను 50 శాతం పెంచాం. పేద, మధ్య తరగతి మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా […]
తాజావార్తలు
-
TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
-
Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
-
RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి
-
Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
-
Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!