What an idea: ఆ రైతు ఐడియాకు జనం ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిష్టికి మన సమాజంలో ఎనలేని విలువ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటిముందు దిష్టిబొమ్మ కట్టడం, ఏదైనా పని ప్రారంభించినా గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి లేకుండా చూసుకోవడం… దిష్టేమైనా తగిలిందేమోనని దిష్టిమంత్రాలు, యంత్రాలు వేయించడం సర్వసాధారణం. ఇలా దిష్టికి ఎనలేని ప్రాధాన్యత ఉంది మన సమాజంలో నరదిష్టంటే అంతకు మించి భయం వుంటుంది. అందుకే ఓ రైతు తన పంటకు దిష్టి తగలకుండా మనుషుల నుండి పక్షుల నుండి రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి అనుసరిస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన తొమ్మిదెకరాల్లో అద్భుతమైన, ఆదర్శవంతమైన పంట సాగు చేస్తున్నాడు. ప్రధానంగా బొప్పాయి పంటను వేసిన శ్రీనివాస్ రెడ్డి… అంతర్ పంటలుగా బంతి, దానిమ్మ వంటి పూలు, పండ్ల పంటలు వేశాడు. ఈయన బొప్పాయి పంట ఏపుగా పెరిగి అటుగా వెళ్లేవారందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల రైతులతో పాటే… సామాన్య జనం కూడా శ్రీనివాస్ రెడ్డి సాగు పద్ధతులు తెలుసుకోవడానికి వస్తుంటారు. ఈ బొప్పాయి పంటలను చూసి ఆకర్షితులై ఈయన పంటపొలంలోకి వెళ్లి మరీ పంటసాగు పద్దతిని తెలుసుకుంటున్నారు. దాంతోపాటే మానవ సహజమైన… పొగడ్తలతో, ఆశ్చర్యాలతో, అతిశయోక్తులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఎందుకో రైతు శ్రీనివాస్ రెడ్డిలో చిన్న అనుమానం మొదలైంది. ఇంతమంది వచ్చిపోతున్నారు నరదిష్టి పడటం వల్ల ఏదైనా నాపంటకు హాని జరుగుతుందా అని ఆందోళనకు గురయ్యాడు. ఆందోళన నుండి వచ్చిన ఆలోచన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని మరోసారి వార్తల్లో నిలిపింది. శ్రీనివాస్ కు వచ్చిన ఆలోచనతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా… తన పంటలపై నరదిష్టి పడకుండా.. ఇంకోవైపు తన పంటపొలాలను పిట్టలు, పక్షుల వంటి వాటి నుండి కాపాడుకునే ఉపాయం ఒకటి తట్టింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చాడు.
తనకిష్టమైన పలువురు హీరోయన్ల అందమైన ఫోటోలను తన పంటపొలాల్లో ఇప్పుడు దిష్టిబొమ్మలను చేశాడు. తమన్నా, సమంత, పూజాహెగ్డే, రష్మిక మందన్నా… ఇలా ఇవాళ ఇండస్ట్రీని ఒక ఊపుతున్న ఎందరో హీరోయిన్ల ఫ్లెక్సీలన్నీ రంగురంగుల్లో అందంగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పంటను కాపాడుతున్నాయి. మరోవైపు ఫ్లెక్సీల్లో మెరిసే కలర్స్, వెలుతురుకు వచ్చే రిఫ్లెక్షన్స్ తో బొమ్మలను చూసి పక్షులు కూడా పారిపోతున్నాయి. మన శ్రీనివాస్ రెడ్డి బొప్పాయి తోటకు హీరోయిన్లు కాపలా వుంటున్నారంటూ జోక్స్ వేసుకుంటున్నారు జనం.
తాజావార్తలు
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..