What an idea: ఆ రైతు ఐడియాకు జనం ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిష్టికి మన సమాజంలో ఎనలేని విలువ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటిముందు దిష్టిబొమ్మ కట్టడం, ఏదైనా పని ప్రారంభించినా గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి లేకుండా చూసుకోవడం… దిష్టేమైనా తగిలిందేమోనని దిష్టిమంత్రాలు, యంత్రాలు వేయించడం సర్వసాధారణం. ఇలా దిష్టికి ఎనలేని ప్రాధాన్యత ఉంది మన సమాజంలో నరదిష్టంటే అంతకు మించి భయం వుంటుంది. అందుకే ఓ రైతు తన పంటకు దిష్టి తగలకుండా మనుషుల నుండి పక్షుల నుండి రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి అనుసరిస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన తొమ్మిదెకరాల్లో అద్భుతమైన, ఆదర్శవంతమైన పంట సాగు చేస్తున్నాడు. ప్రధానంగా బొప్పాయి పంటను వేసిన శ్రీనివాస్ రెడ్డి… అంతర్ పంటలుగా బంతి, దానిమ్మ వంటి పూలు, పండ్ల పంటలు వేశాడు. ఈయన బొప్పాయి పంట ఏపుగా పెరిగి అటుగా వెళ్లేవారందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల రైతులతో పాటే… సామాన్య జనం కూడా శ్రీనివాస్ రెడ్డి సాగు పద్ధతులు తెలుసుకోవడానికి వస్తుంటారు. ఈ బొప్పాయి పంటలను చూసి ఆకర్షితులై ఈయన పంటపొలంలోకి వెళ్లి మరీ పంటసాగు పద్దతిని తెలుసుకుంటున్నారు. దాంతోపాటే మానవ సహజమైన… పొగడ్తలతో, ఆశ్చర్యాలతో, అతిశయోక్తులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ఎందుకో రైతు శ్రీనివాస్ రెడ్డిలో చిన్న అనుమానం మొదలైంది. ఇంతమంది వచ్చిపోతున్నారు నరదిష్టి పడటం వల్ల ఏదైనా నాపంటకు హాని జరుగుతుందా అని ఆందోళనకు గురయ్యాడు. ఆందోళన నుండి వచ్చిన ఆలోచన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని మరోసారి వార్తల్లో నిలిపింది. శ్రీనివాస్ కు వచ్చిన ఆలోచనతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా… తన పంటలపై నరదిష్టి పడకుండా.. ఇంకోవైపు తన పంటపొలాలను పిట్టలు, పక్షుల వంటి వాటి నుండి కాపాడుకునే ఉపాయం ఒకటి తట్టింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చాడు.
తనకిష్టమైన పలువురు హీరోయన్ల అందమైన ఫోటోలను తన పంటపొలాల్లో ఇప్పుడు దిష్టిబొమ్మలను చేశాడు. తమన్నా, సమంత, పూజాహెగ్డే, రష్మిక మందన్నా… ఇలా ఇవాళ ఇండస్ట్రీని ఒక ఊపుతున్న ఎందరో హీరోయిన్ల ఫ్లెక్సీలన్నీ రంగురంగుల్లో అందంగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పంటను కాపాడుతున్నాయి. మరోవైపు ఫ్లెక్సీల్లో మెరిసే కలర్స్, వెలుతురుకు వచ్చే రిఫ్లెక్షన్స్ తో బొమ్మలను చూసి పక్షులు కూడా పారిపోతున్నాయి. మన శ్రీనివాస్ రెడ్డి బొప్పాయి తోటకు హీరోయిన్లు కాపలా వుంటున్నారంటూ జోక్స్ వేసుకుంటున్నారు జనం.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!