అస్సాంలోని గోల్పరా జిల్లాలో గురువారం అడవి ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారని లఖీపూర్ అటవీ రేంజ్ అధికారి ధృబా దత్తా తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్కు చేరుకున్నారు.
కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో... కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.
కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కరీంనగర్ బీజేపీ అడ్డా అని.. బండి సంజయ్ అడ్డా అంటూ ఆయన అన్నారు.
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్కు హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు... తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్స్లో భాగంగా భద్రాద్రి, ములుగు జిల్లాలో పర్యటించినట్లు డీజీపీ వెల్లడించారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్ను చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. భూ ప్రకంపనల కారణంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం బిహార్ రాజకీయాలను వణికిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్యం తాగితే చచ్చిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం నితీష్ తీవ్రంగా స్పందించారు.