Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు జమ్మూ & కాశ్మీర్
- తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు జమ్మూ & కాశ్మీర్
- సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్ మ్యాచ్లో నాల్గవ రోజు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ విజయానికి నిజమైన హీరో ఆకిబ్ నబీ, ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు, అందులో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ బ్యాటింగ్తో కూడా తన వంతు పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్లో 82 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో అజేయంగా 30 పరుగులు చేసి జట్టు ఈ కీలకమైన విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
వాస్తవానికి ఫిబ్రవరి 16 సోమవారం వరకు జమ్మూ కాశ్మీర్, బెంగాల్ జట్ల మధ్య గట్టి పోటీగా భావించారు, ఫిబ్రవరి 17 మంగళవారం ఏకపక్ష పోరాటంగా మారింది. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్లు అకిబ్ నబీ దార్ (4/36), సునీల్ కుమార్ (4/27) అకస్మాత్తుగా మ్యాచ్ను మలుపు తిప్పి తమ జట్టును తొలి రంజీ ట్రోఫీ ఫైనల్కు తీసుకెళ్లారు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ 99 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read:Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
జమ్మూ కాశ్మీర్ జట్టుకు కేవలం 126 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేశారు, నాలుగో రోజు ఇంకా 83 పరుగులు మాత్రమే అవసరం, వంశ్ శర్మ అజేయంగా 43 పరుగులు, అబ్దుల్ సమద్ అజేయంగా 30 పరుగులు చేయడంతో ఈ విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్లో కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 302 పరుగులకు ముగిసింది. మహమ్మద్ షమీ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులకు 8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ పడగొట్టాడు. బెంగాల్పై ఈ విజయంతో, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లోని అతిపెద్ద ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన హిమాలయ ప్రాంతం నుండి తొలి జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?