Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్ఎస్ భరతం పడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో… కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు. కేసీఆర్… కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మొదలు పెట్టినప్పుడు ఇది మనకు శ్రీరామ రక్ష అన్నడు.. ఇది ఒక మానవ అద్భుతం అన్న ఆయన… గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర పోలీసు బూట్ల సప్పుడు తప్ప, ఎవరినీ పోనివ్వడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే… మొన్నటి వరదకి, మోటార్లు మునిగిపోయాయని విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి పంపు హౌజ్లో 18, అన్నారంలో 12 పంపులు మునిగాయన్నారు. తాను చెప్పేది తప్పైతే… ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా చెల్లించారని అన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ భూ నిర్వాసితులకు ఈనాటికి ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. రైతుల భూములను నిండా ముంచి, రైతుల నోట్లో మట్టి కొట్టిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఎస్సారెస్పీ ఎత్తిపోతల ద్వారా ఒక్క చుక్క నీరు రాలేదు… వచ్చింది అంతా వరదతోనే అంటూ ఆయన తెలిపారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Bandi Sanjay: కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
మార్పుకు నాంది కరీంనగర్ అని.. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా అంటూ ఈటల రాజేందర్ తెలిపారు.2006లో డబ్బులతో నాయకులను కొన్నా… కరీంనగర్ ప్రజలు తనను గెలిపించారన్నారు. హుజూరాబాద్లో 4000 కోట్లు ఖర్చు పెట్టినా… చైతన్య ప్రజలు తనను గెలిపించారన్నారు. ఈ 8 ఏళ్లలో లక్షల కోట్లు ఎలా సంపాదించావో సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. కేసీఆర్కు యావ అంతా కుటుంబం మీదే… తెలంగాణపై కాదన్నారు. తెలంగాణలో ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సర్పంచ్లది సుంకరోళ్లకంటే అధ్వాన్న పరిస్థితి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, పార్టీల మధ్య ఇనుప కంచెలు పెట్టారంటూ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సుఖంగా లేరన్నారు. మత్స్యకారుల కళ్ళలో మట్టి కొట్టాలని చూస్తే… సహించేది లేదన్నారు. కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి అని.. బీఆర్ఎస్ పార్టీ భరతం పడతామన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!