తిరుపతి బాలాజీ ఆలయ దర్శనానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొండల మధ్య ఉంది. కలియుగంలో వేంకటేశ్వరుడు తన భక్తులను సమస్యల నుండి రక్షించడానికి అవతరించినట్లు భక్తులు విశ్వసిస్తారు. మీరు కూడా తిరుపతి బాలాజీని సందర్శించాలనుకుంటే తిరుమల దర్శన్ ప్యాకేజీని బుక్ చేసుకోవడం ద్వారా మీరు ఒకేసారి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. కాబట్టి వివరాలు తెలుసుకుందాం.
కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 47 మంది నివాసితులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్ను కేటుగాళ్లు మోసం చేశారు. వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్ను రూ. 7 కోట్ల మేర మోసగించిన అంతర్-రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం ఛేదించారు.
నేడు సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల విచారణ జరగనుంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో అనేక కేసులు విచారణకు రానున్నాయి, ఇందులో తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే కేసుపై నేడు అందరి దృష్టి ఉంటుంది. ఇది కాకుండా కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు వ్యతిరేకంగా పాకిస్థాన్లోని దక్షిణ నగరమైన కరాచీలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. అయితే కొద్దిసేపటికే నిరసన హింసాత్మకంగా మారింది. చాలా మంది ప్రజలు రాళ్లు రువ్వడం ప్రారంభించారు.