Delhi CM Atishi: దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లు.. సీఎం అతిషి హామీ
- దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తాం
- ఢిల్లీలోని రోడ్లను పరిశీలించిన సీఎం అతిషి..మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi CM Atishi: దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీనిలో భాగంగా దీపావళి నాటికి ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను రెడీ చేస్తామని ఢిల్లీ సీఎం అతిషి చెబుతున్నారు. ఎన్ఎస్ఐసీ ఓఖ్లా, మోడీ మిల్ ఫ్లైఓవర్, చిరాగ్ ఢిల్లీ, తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్, మధుర రోడ్, ఆశ్రమ చౌక్ల రోడ్లను సీఎం అతిషి పరిశీలించారు. దీపావళి వరకు దెబ్బతిన్న అన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) రోడ్లను మరమ్మతు చేయడానికి అవసరమైన సూచనలు ఇచ్చారు.
Read Also: Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ నమోదుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
రోడ్ల పరిశీలన అనంతరం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీలోని రోడ్లను పరిశీలించి.. రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని… పార్టీ ఎమ్మెల్యేలందరికీ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారని తెలిపారు. ఢిల్లీ రోడ్ల పునరుద్ధరణకు మంత్రులు కృషి చేయాలని సీఎం అతిషి సూచించారు. తాను దక్షిణ, ఆగ్నేయ ఢిల్లీలోని రోడ్ల బాధ్యతను తీసుకున్నానని ఆమె చెప్పారు. సౌరభ్ భరద్వాజ్ తూర్పు ఢిల్లీ రోడ్లను తనిఖీ చేయనున్నారని, గోపాల్ రాయ్ ఈశాన్య ఢిల్లీలోని రోడ్లను తనిఖీ చేస్తారని, ఇమ్రాన్ హుస్సేన్ సెంట్రల్ రోడ్లను తనిఖీ చేస్తారన్నారు. నైరుతి, ఔటర్ ఢిల్లీకి కైలాష్ గెహ్లాట్, వాయువ్య ఢిల్లీకి ముఖేష్ సెహ్రావత్ బాధ్యత వహిస్తారని సీఎం అతిషి తెలిపారు. దీపావళి నాటికి ఢిల్లీ ప్రజలకు గుంతలు లేని రహదారులను అందించడానికి తాము ప్రయత్నిస్తామన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ రోడ్ అసెస్మెంట్, రిపేర్ ప్లాన్ ప్రకారం, 1,400 కి.మీ పొడవున్న పీడబ్ల్యుడి రోడ్లను ఒక వారం పరిశీలించిన తర్వాత, ఏ రోడ్లకు పూర్తి మరమ్మతు, పాక్షిక మరమ్మతులు అవసరం, ఏది పునర్నిర్మించాలో నిర్ణయించబడుతుంది. రోడ్ల పరిశీలన తర్వాత వారంలో మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి. గత వారం ప్రారంభంలో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రికి లేఖ అందజేశారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని అభ్యర్థించారు.పవర్ డిస్కమ్లు, ఢిల్లీ జల్బోర్డు చేపట్టిన పనుల వల్లే నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆ తర్వాత మరమ్మతులు చేపట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!