కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.
ఇటాలియన్ అధికారులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు. వారు సిసిలీ దక్షిణ తీరంలో రికార్డు స్థాయిలో 5.3-టన్నుల కొకైన్ సరుకును అడ్డుకున్నారు.
ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది.
తాను ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో సదరు యువకుడిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ కొత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు.
రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
బాడీబిల్డింగ్ ప్రపంచంలో ఆశిష్ సఖార్కర్ గురించి తెలియని వారు ఉండరు. మిస్టర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫోరమ్లలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆశిష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ లెజెండరీ బాడీబిల్డర్ కన్నుమూశారు.
రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.