Rain Problems in Hyderbad: వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. నీట మునుగుతున్న కాలనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Problems in Hyderbad: గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫిరంగీ నాలాలు కబ్జా చేయడంతో కాలనీలోకి వరద నీరు చేరుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, పట్టించుకునే నాథుడు లేకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించినట్లు స్థానికులు వాపోతున్నారు.
Also Read: Children Died: నీటి గుంతలో పడి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఘటన
Also Read
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
రాజేంద్రనగర్ శాస్త్రీపురం మదీనా కాలనీలోకి వరద నీరు భారీగా చేరడంతో కాలనీ అంతా జలమయమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలో ఉన్న సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడి పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల వరద నీరు వెళ్లే దారి లేక ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగి.. మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు.
Also Read: Rains Effect: జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
కుత్భుల్లాపూర్ గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లేవ్లోకి మోకాలు లోతు నీరు వచ్చిచేరింది. గడిచిన రాత్రి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. కాలనీలో వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాక్స్ నాలా పనులు అర్ధాంతరంగా, ప్రణాళిక లేకుండా మధ్యలో మొదలు పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, మహరాజ్గంజ్, ఫిల్ఖాన, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్నగర్లోని సాయికృష్ణ అపార్ట్మెంట్ లోనికి వరద నీరు చేరడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!