Rain Problems in Hyderbad: వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. నీట మునుగుతున్న కాలనీలు
Rain Problems in Hyderbad: గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫిరంగీ నాలాలు కబ్జా చేయడంతో కాలనీలోకి వరద నీరు చేరుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, పట్టించుకునే నాథుడు లేకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించినట్లు స్థానికులు వాపోతున్నారు.
Also Read: Children Died: నీటి గుంతలో పడి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఘటన
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
రాజేంద్రనగర్ శాస్త్రీపురం మదీనా కాలనీలోకి వరద నీరు భారీగా చేరడంతో కాలనీ అంతా జలమయమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలో ఉన్న సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడి పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల వరద నీరు వెళ్లే దారి లేక ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగి.. మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు.
Also Read: Rains Effect: జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
కుత్భుల్లాపూర్ గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లేవ్లోకి మోకాలు లోతు నీరు వచ్చిచేరింది. గడిచిన రాత్రి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. కాలనీలో వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాక్స్ నాలా పనులు అర్ధాంతరంగా, ప్రణాళిక లేకుండా మధ్యలో మొదలు పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, మహరాజ్గంజ్, ఫిల్ఖాన, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్నగర్లోని సాయికృష్ణ అపార్ట్మెంట్ లోనికి వరద నీరు చేరడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!