హాయ్ ఫ్రెండ్స్.. బర్రెలు కాయడానికి వచ్చానండి.. ఒక్కో బర్రె 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్.. పెద్ద చదవులు చదివినా ఉద్యోగం రాక బర్ల కాడికి వచ్చిన అంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. సరదాగా చేసిందో.. లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ.. ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తెలంగాణను రాజకీయాల కోసం వాడుకొని దగా చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నాయకత్వం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అరగంటకు పైగా సమావేశం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు ఈ భేటీలో పాల్గొన్నారు.