మేమంతా సిద్ధం 12వ రోజు రేపటి (ఏప్రిల్ 10) షెడ్యూల్ను వైసీపీ ఇవాళ (మంగళవారం) విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు.
వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలిస్తుందని రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు.
ఏపీలో వైసీపీ ఇంజిన్ ఒకటే.. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇంజిన్లతో పని లేదు.. ఇంజిన్ కన్నా శరవేగంగా దూసుకుపోగల సత్తా జగనన్నది అని మార్గాని భరత్ అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఉగాది శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయాను అని పేర్కొన్నారు.
వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు.
ప్రజా మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలు సమావేశం అయింది. ప్రజా మేనిఫెస్టో రూప కల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా అభిప్రాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.