Gidugu Rudra Raju: మేం అధికారంలోకి వస్తే.. పేదలకు, నిరుద్యోగులకు, రైతులకు న్యాయం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో న్యాయపత్ర అనే పేరుతో 48 పేజీల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందని రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఇందులో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సమాజంలో సామాజిక న్యాయం, కులగణన చేపట్టడం ద్వారా ఆయా కులాల వారికి సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ దాటకూడదని ఉంది.. అయితే, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ప్రజలు వేసిన ప్రక్రియ కొనసాగించే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామనే విషయం ఇందులో పొందుపరిచారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతారని దీనిని కూడా ఇందులో పొందుపరిచారని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు.
Read Also: Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..
Also Read
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
కాగా, ఏ ఉద్యమం జరిగినా నీటి కోసం హక్కుల కోసం భూమి కోసం జరుగుతాయని గిడుగు రుద్రరాజు తెలిపారు. వీటన్నిటినీ పరిరక్షించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుందన్నారు. కిసాన్ న్యాయ పేరుతో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ గిట్టుబాటు ధర కల్పించడం, పెట్టుబడి కంటే లాభం చేకూర్చే విధంగా కొత్త చట్టానికి కల్పన చేయడం రుణమాఫీ ఆయా రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిన 30 రోజుల్లోనే రుణమాఫీ చేసే విధంగా పార్లమెంట్లో చట్టం చేస్తామన్నారు. అలాగే, శ్రామికుల కోసం జాతీయ స్థాయిలో ఆరోగ్య భద్రత కలిగించే విధంగా చట్టం తీసుకురావడంతో పాటు కనీస వేతనం రోజుకి 400 రూపాయలు చేస్తూ చట్టం తీసుకు వస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికై కేంద్రంలో ఉన్న 30 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అన్ని అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు గిడుగు రుద్రరాజు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!