నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.
Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు.
BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన దాడిపై కమిషనర్ ఇలంబరితిని కలిసి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. అయితే, సీఎం ప్రోగ్రాం కారణంగా అందుబాటులో కమిషనర్ లేకపోవడంతో.. అడిషనల్ కమిషనర్ శివ ప్రసాద్ నాయుడుకి ఫిర్యాదు పత్రం అందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి.. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అని సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ప్రశ్నించారు. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా? అని సెటైర్లు వేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అడిగిన సుప్రీం కోర్టు.
Osmania Hospital: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు.
Goshamahal Tension: గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపనకు నిరసనగా స్థానికులు, వ్యాపారులు గోషామహల్ బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Harish Rao: బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.. ఇప్పుడు ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Hyderabad: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన యువకుడుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయింది.
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారు. జనవరి ఒకటిన ప్రారంభించాం.. గతంలో వారోత్సవాలను మాసోత్సవాలు చేశారు.. బ్లాక్ స్పాట్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం మొదలైంది.