టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తాజాగా ఎన్టీవీతో మాట్లాడినా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు. నాకు మరోసారి చ్చినందుకు సంతోషిస్తున్న. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే. భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా.. టీటీడీలో గతంలో చేయకుండా మిగిలిన కార్యక్రమాలకు తోడుగా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతాం అని తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్లో టీటీడీ ఎలాంటి వివక్ష చూపలేదు. బోర్డు సభ్యుల నియామకంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఒత్తిళ్లకు లొంగని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి… సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించాం. కోవిడ్ నేపథ్యంలో కొన్ని పనులు చేయలేకపోయాము అని పేర్కొన్నారు.