YV Subba Reddy: తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
- తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి..
- శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలి.. ల్యాబ్ నివేదిక రాకముందే మీడియా లీకులు..
- వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు తిరుమల పవిత్రతను వాడుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాక ముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారు.. అప్పుడు సుప్రీం కోర్టును టీటీడీ ఆశ్రయించింది అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్!
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
అయితే, సీబీఐ ఆధ్వర్యంలో సెట్ విచారణకు కోర్టు ఆదేశించిందని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిట్ విచారణ పూర్తి కాక ముందే మళ్లీ అవే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వలన భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.. మొదట విజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్నారు.. ఆ తర్వాత జంతువుల కొవ్వు కలిసింది అన్నారు.. ల్యాబ్ నివేదికలు రాక ముందే ఇలాంటి నిర్ణయానికి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా మాత్రమే వాస్తవాలను ప్రకటించాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?
ఇక, మా ప్రభుత్వ హయాంలో రూ. 326ల చొప్పున నెయ్యి కొనుగోలు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అందులో కల్తీ జరిగి ఉంటే.. మరి చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధర రూ. 274, రూ.276, రూ.279లకే కొనుగోలు చేశారు.. మరి అందులో కూడా కల్తీ జరిగినట్లు అంగీకరిస్తారా? అని అడిగారు. ధర ఆధారంగా కల్తీ ఆరోపణలు చేయడం సబబు కాదు.. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటానికి తిరుమల పవిత్రతను వాడుకోవద్దు అని కోరారు. మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేయొద్దు.. భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు అని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!