YV Subba Reddy: తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
- తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి..
- శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలి.. ల్యాబ్ నివేదిక రాకముందే మీడియా లీకులు..
- వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు తిరుమల పవిత్రతను వాడుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాక ముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారు.. అప్పుడు సుప్రీం కోర్టును టీటీడీ ఆశ్రయించింది అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్!
Also Read
అయితే, సీబీఐ ఆధ్వర్యంలో సెట్ విచారణకు కోర్టు ఆదేశించిందని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిట్ విచారణ పూర్తి కాక ముందే మళ్లీ అవే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వలన భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.. మొదట విజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్నారు.. ఆ తర్వాత జంతువుల కొవ్వు కలిసింది అన్నారు.. ల్యాబ్ నివేదికలు రాక ముందే ఇలాంటి నిర్ణయానికి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా మాత్రమే వాస్తవాలను ప్రకటించాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?
ఇక, మా ప్రభుత్వ హయాంలో రూ. 326ల చొప్పున నెయ్యి కొనుగోలు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అందులో కల్తీ జరిగి ఉంటే.. మరి చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధర రూ. 274, రూ.276, రూ.279లకే కొనుగోలు చేశారు.. మరి అందులో కూడా కల్తీ జరిగినట్లు అంగీకరిస్తారా? అని అడిగారు. ధర ఆధారంగా కల్తీ ఆరోపణలు చేయడం సబబు కాదు.. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటానికి తిరుమల పవిత్రతను వాడుకోవద్దు అని కోరారు. మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేయొద్దు.. భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు అని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!