YV Subba Reddy: తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
- తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి..
- శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలి.. ల్యాబ్ నివేదిక రాకముందే మీడియా లీకులు..
- వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు తిరుమల పవిత్రతను వాడుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాక ముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారు.. అప్పుడు సుప్రీం కోర్టును టీటీడీ ఆశ్రయించింది అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్!
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
అయితే, సీబీఐ ఆధ్వర్యంలో సెట్ విచారణకు కోర్టు ఆదేశించిందని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిట్ విచారణ పూర్తి కాక ముందే మళ్లీ అవే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వలన భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.. మొదట విజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్నారు.. ఆ తర్వాత జంతువుల కొవ్వు కలిసింది అన్నారు.. ల్యాబ్ నివేదికలు రాక ముందే ఇలాంటి నిర్ణయానికి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా మాత్రమే వాస్తవాలను ప్రకటించాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?
ఇక, మా ప్రభుత్వ హయాంలో రూ. 326ల చొప్పున నెయ్యి కొనుగోలు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అందులో కల్తీ జరిగి ఉంటే.. మరి చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధర రూ. 274, రూ.276, రూ.279లకే కొనుగోలు చేశారు.. మరి అందులో కూడా కల్తీ జరిగినట్లు అంగీకరిస్తారా? అని అడిగారు. ధర ఆధారంగా కల్తీ ఆరోపణలు చేయడం సబబు కాదు.. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటానికి తిరుమల పవిత్రతను వాడుకోవద్దు అని కోరారు. మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేయొద్దు.. భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు అని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!