మాజీ మంత్రి దేవినేని ఉమపై రాళ్ల దాడి… పరిస్థితి ఉద్రిక్తం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Read: ప్రధాని మోడీకి దీదీ కీలక సూచన…
Also Read
పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్పందించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలనే వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని అన్నారు. తాను ఫోన్ చేసిన తరువాతే వివాదం సద్ధుమణిగిందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు, రెచ్చగొట్టడానికే దేవినేని క్వారీ వద్దకు వెళ్లినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవినేని వైఖరి వలనే ప్రశాంతంగా ఉన్న మైలవరంలో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయని కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..