YSRCP Plenary 2022: ముగిసిన వైసీపీ తొలిరోజు ప్లీనరీ.. నాలుగు తీర్మానాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల పాటు జరుగుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి.. సాయంత్రం 5 గంటల తర్వాత తొలిరోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరు కావడంతో పండగలా వైఎస్సార్సీపీ ప్లీనరీ సాగింది.. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపిస్తూ.. సాగిన మంత్రులు, నేతల ఉపన్యాసాలు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి..
Read Also: Live : సీఎం కుర్చీని టచ్ చేయండి చూద్దాం | Anil Kumar Yadav Aggressive Speech | Ysrcp Plenary 2022
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఇక, తొలిరోజు ప్లీనరీ సమావేశాల్లో నాలుగు తీర్మానాలు చేశారు.. మహిళా సాధికారత-దిశ చట్టంపై తొలి తీర్మానం చేయగా, విద్యా రంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం, నవరత్నాలు-డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్)పై మూడో తీర్మానం, వైద్యారోగ్య రంగంపై నాలుగో తీర్మానం చేశారు మంత్రులు.. ఇక, ఈ తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది.. మరోవైపు, 2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించాం. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేశాడు దేవుడు. అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం అని వ్యాఖ్యానించారు సీఎం జగన్. ఇక, ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని అన్నారు వైఎస్ విజయమ్మ. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్పై విరుచుకుపడ్డా బెదరలేదు.. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు. జగన్ మాస్ లీడర్.. యువతకు రోల్ మోడల్.. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్ను చూసి గర్వపడుతున్నానన్నారు. మొత్తంగా భారీ సంఖ్యలో హాజరైన ప్రతినిధులు.. వారి కోసం ఏర్పాటు చేసిన వంటకాలు.. నేతల ఉపన్యాసాలు.. ఇలా తొలిరోజు ఉత్సాహవంతమైన వాతావరణంలో వైసీపీ ప్లీనరీ ముగిసింది.. రెండు రోజుల పాటు సాగనున్న ప్లీనరీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!