YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..
- పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం..
- పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.5 మీటర్లకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగ్గించింది..
- పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది: వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 57 వేల కోట్ల అంచనాతో కేంద్రానికి నివేదిక పంపాం.. టీడీపీ నేతృత్వంలో “ఎన్డీయే” కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజక్ట్ ఎత్తును 41.5 మీటర్లకు తగ్గించింది.. అలాగే, పోలవరం నిధులు కుదించారు.. ఎత్తు తగ్గించడం వలన నీటి నిల్వ సామర్ధ్యం తగ్గి, రాష్ట్రం నష్టపోతుంది అని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర, సృజల స్రవంతికి నీరు అందించాలి.. దానిపై మా పోరాటం కొనసాగుతుంది.. విశాఖ రైల్వే జోన్ ఐదు ఏళ్లలో పూర్తి చేయాలని అప్పుడు కోరాం.. రైల్వే జోన్ పనులు ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది.. వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసి ఒరిస్సాకు ఇచ్చారు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: MP Horror: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన బంధువులు..
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నాలుగు ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు అని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖ స్టీల్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా పోరాటం చేస్తాం.. విశాఖ స్టీల్ కు “కాప్టివ్ మైన్స్” పై రెండు సభల్లో ఒత్తిడి తీసుకొస్తాం.. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చినా ఉద్యోగులలోఆందోళన ఉంది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు సభలో మా నాయకుడు జగన్ పై, పార్టీ ఎంపీలపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్టానికి రావాల్సిన ప్రాజెక్టులకు మా వంతుగా పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర అంశాలను వివరిస్తాం.. అలాగే, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి పంట కొనే పరిస్థితి లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!