అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ నుంచి పాలన కొనసాగించారని గుర్తుచేశారు. ఖచ్చితమైన తేదీ చెప్ప లేము.. కానీ, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు విజయసాయి.
మరోవైపు.. విశాఖలోని పార్కులు, నీటి వనరులు పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నామన్నారు ఎంపీ విజయసాయి.. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం వార్డు డవలప్ మెంట్ ప్లాన్ కోసం కమిటీలు వేశామన్న ఆయన.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం…ముడసర్లోవ పార్క్ను రూ.3 కోట్లతో బృందావన్ గార్డెన్స్ తరహా అభివృద్ధి, సుందరీకరణ చేస్తామన్నారు.. కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.. సింహాచలం దేవస్థానం భూముల రక్షణ కోసం గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించిన ఎంపీ.. విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయించామని.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!