తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా అంశం… పార్లమెంట్లో ఆందోళనకు వైసీపీ సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని కోరినట్టు తెలిపారు.
Read: రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
Also Read
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, ఉక్కుకు లాభాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదే అంశంపై మూడు ప్రతిపాదనలు ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగినట్టు విజయసాయిరెడ్డి పేర్కార్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, సవతి తల్లి ప్రేమను చూసిస్తోందని అన్నారు. పాండిచ్చేరికీ ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ, ఏపీకి హోదా ఎందుకు ఇవ్వడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయాన్ని, రావాల్సిన బకాయిల విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని అన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..