Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Leaders Have Lost Their Addresses Nara Lokesh

Nara Lokesh: పార్టీని లేకుండా చేస్తామన్నారు.. వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు..

Published Date :May 29, 2025 , 4:25 pm
By Chandra Shekhar Pamena
  • సీబీఎన్ అంటే సంక్షేమం.. ఎన్టీఆర్ అంటే ప్రభంజనం.. 94 శాతం స్ట్రైక్ రేట్తో గెలిచాం..
  • టీడీపీ జెండా పీకేస్తామన్నారు.. కానీ వైసీపీ ఆఫీసులకు టు లెట్ బోర్డులు పెట్టారు..
  • పార్టీని లేకుండా చేస్తామన్నారు.. అడ్రస్ లేకుండా పోయారు: మంత్రి నారా లోకేష్
Nara Lokesh: పార్టీని లేకుండా చేస్తామన్నారు.. వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు.. ఇప్పుడు ప్రజలే ఫుట్ బాల్ ఆడుతున్నారు.. మన నాయకుడిని అరెస్టు చేశారు.. ఇప్పుడు ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి ప్రజలు తాళాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇక, ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఓ ప్రభంజనం.. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.. సీబీఎన్ అంటే డెవలప్మెంట్.. సీబీఎన్ అంటే సంక్షేమం, సీబీఎన్ అంటే మనందరి ధైర్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

Read Also: Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్‌ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!

ఇక, అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటం హాలీ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక, నా పైన కూడా 23 కేసులు పెట్టారు.. తగ్గేదే లేదు అని ఆనాడే చెప్పాం.. విధ్వంసం పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.. ఒక్క కంపెనీ తీసుకురాక పోగా ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు వెళ్లేలా చేశారు.. జే బ్రాండ్ లిక్కర్ పేరుతో మద్యం కంటే విషం పంచారు అని ఆరోపించారు. అయితే, పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానం.. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి మన కోసం పని చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో ఫ్రీబస్ ను నా అక్కా చెల్లెమ్మలకు కల్పిస్తున్నాం అన్నారు. అలాగే, 16 వేల మందితో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం.. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు.. ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం కూటమి సర్కార్ పరిష్కరిస్తుంది.. 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయి, దీని ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..

అలాగే, వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ కుటుంబాలను కలుస్తున్నాను అని మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ కార్యకర్తల్లారా ఏనాడైనా మీ నాయకుడు కలిశారా?.. 25 ఎంపీ స్థానాల్లో కూటమి 21 స్థానాల్లో గెలిచింది.. దీంతో కేంద్ర ప్రభుత్వం మనతో కలిసి పని చేస్తుంది.. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు సహజం.. మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు ఉండకూడదు.. ఈగోలు వదిలి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ఇక, తల్లిని చెల్లిని గెంటింది ఎవరు?.. బాబాయినీ చంపింది ఎవరు?.. జే బ్రాండ్ అమ్మి ప్రజల రక్తం పీల్చింది ఎవరు?.. అందరూ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు.. ఎందుకయ్య అంత భయం.. రెడ్ బుక్ అనగానే ఒకడికి గుండెపోటు, ఇంకొడికి బాత్ రూంలో కాలు విరిగింది, మరొక్కడు ఎక్కడ ఉన్నాడో తెలియదు.. అర్థ మైందా రాజా.. రాయలసీమ గడ్డా టీడీపీ అడ్డా అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CMChandrababu
  • Kadapa
  • mahanadu
  • Mahanadu 2025
  • Nara Lokesh

తాజావార్తలు

  • Oppo F33, F33 Pro: ఒప్పో F33, F33 ప్రో ఈ నెలలో రిలీజ్.. ధర, ఫీచర్‌ల పూర్తి వివరాలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

ట్రెండింగ్‌

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions