Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
- పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్న పహల్గామ్ ఉగ్ర సూత్రధారి..
- భారత్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సైఫుల్లా కసూరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సవమైన యూమ్-ఎ-తక్బీర్ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) నిర్వహించిన ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమావేశానికి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి నన్ను సూత్రధారిగా నిందించారు, ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది” అని పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్లో జరిగిన ర్యాలీలో కసూరి అన్నారు.
Also Read
Read Also: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు
ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సైఫుల్లా కసూరి.. అల్లాహాబాద్ సెంటర్లో ‘‘ముదస్సిర్ షహీద్’’పేరుతో ఒక ఆస్పత్రిని నిర్మించబతోన్నట్లు ప్రకటించాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో హతమైన అనేక మంత్రి హై ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్, జిహాదీ నినాదాలతో పాటు “నారా-ఎ-తక్బీర్”తో నిండిన ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) పార్టీని లష్కరే తోయిబాకు సంబంధించిన రాజకీయ పార్టీ. పాకిస్తాన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్లోని NA-122 స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసిన సయీద్, ఎన్నికల్లో ఓడిపోయాడు. 2008 ముంబై దాడులకు సూత్రధారిగా ఉన్న హఫీస్ సయీద్ ఈ పార్టీ తెరవెనక కార్యకలాపాల్లో ఉన్నాడు.
🚨🇵🇰👹 Exclusive
Alert : Lengthy 20 min hate speech
After going into hiding for several days following #OperationSindoor , Lashkar-E-Tayiba Deputy Chief Saifullah Kasuri asserts that India wrongfully implicated him in the Pahalgam attack. He even goes so far as to say that… pic.twitter.com/QTWafflJ2l
— OsintTV 📺 (@OsintTV) May 28, 2025
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!