Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
- పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్న పహల్గామ్ ఉగ్ర సూత్రధారి..
- భారత్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సైఫుల్లా కసూరి..
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సవమైన యూమ్-ఎ-తక్బీర్ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) నిర్వహించిన ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమావేశానికి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి నన్ను సూత్రధారిగా నిందించారు, ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది” అని పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్లో జరిగిన ర్యాలీలో కసూరి అన్నారు.
Also Read
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
- Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
Read Also: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు
ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సైఫుల్లా కసూరి.. అల్లాహాబాద్ సెంటర్లో ‘‘ముదస్సిర్ షహీద్’’పేరుతో ఒక ఆస్పత్రిని నిర్మించబతోన్నట్లు ప్రకటించాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో హతమైన అనేక మంత్రి హై ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్, జిహాదీ నినాదాలతో పాటు “నారా-ఎ-తక్బీర్”తో నిండిన ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) పార్టీని లష్కరే తోయిబాకు సంబంధించిన రాజకీయ పార్టీ. పాకిస్తాన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్లోని NA-122 స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసిన సయీద్, ఎన్నికల్లో ఓడిపోయాడు. 2008 ముంబై దాడులకు సూత్రధారిగా ఉన్న హఫీస్ సయీద్ ఈ పార్టీ తెరవెనక కార్యకలాపాల్లో ఉన్నాడు.
🚨🇵🇰👹 Exclusive
Alert : Lengthy 20 min hate speech
After going into hiding for several days following #OperationSindoor , Lashkar-E-Tayiba Deputy Chief Saifullah Kasuri asserts that India wrongfully implicated him in the Pahalgam attack. He even goes so far as to say that… pic.twitter.com/QTWafflJ2l
— OsintTV 📺 (@OsintTV) May 28, 2025
తాజావార్తలు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
-
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?