Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
- పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్న పహల్గామ్ ఉగ్ర సూత్రధారి..
- భారత్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న సైఫుల్లా కసూరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సవమైన యూమ్-ఎ-తక్బీర్ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) నిర్వహించిన ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమావేశానికి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి నన్ను సూత్రధారిగా నిందించారు, ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది” అని పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్లో జరిగిన ర్యాలీలో కసూరి అన్నారు.
Also Read
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
Read Also: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు
ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సైఫుల్లా కసూరి.. అల్లాహాబాద్ సెంటర్లో ‘‘ముదస్సిర్ షహీద్’’పేరుతో ఒక ఆస్పత్రిని నిర్మించబతోన్నట్లు ప్రకటించాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో హతమైన అనేక మంత్రి హై ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్, జిహాదీ నినాదాలతో పాటు “నారా-ఎ-తక్బీర్”తో నిండిన ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) పార్టీని లష్కరే తోయిబాకు సంబంధించిన రాజకీయ పార్టీ. పాకిస్తాన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్లోని NA-122 స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసిన సయీద్, ఎన్నికల్లో ఓడిపోయాడు. 2008 ముంబై దాడులకు సూత్రధారిగా ఉన్న హఫీస్ సయీద్ ఈ పార్టీ తెరవెనక కార్యకలాపాల్లో ఉన్నాడు.
🚨🇵🇰👹 Exclusive
Alert : Lengthy 20 min hate speech
After going into hiding for several days following #OperationSindoor , Lashkar-E-Tayiba Deputy Chief Saifullah Kasuri asserts that India wrongfully implicated him in the Pahalgam attack. He even goes so far as to say that… pic.twitter.com/QTWafflJ2l
— OsintTV 📺 (@OsintTV) May 28, 2025
తాజావార్తలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!