Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
- పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్
- రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
- మొబైల్లో కీలక ఫైల్స్ డిలీట్ అయినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్కు గూఢచర్యం చేసిన రాజస్థాన్కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్ను బుధవారం రాత్రి జైసల్మేర్లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉన్నత స్థాయి సమాచారం మేరకు షకుర్ ఖాన్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. ఇక షకుర్ ఖాన్ ఫోన్లో పలువురి పాకిస్థానీయుల నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి గురించి సరైన సమాధానం ఇవ్వలేనట్లుగా తెలుస్తోంది. ఇక పాకిస్థాన్కు ఏడు సార్లు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే మొబైల్స్లో కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లుగా కనిపెట్టారు. అలాగే బ్యాంక్ ఖాతాలపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే ఒక ఖాతా క్లోజ్ అయింది. దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇదిలా ఉంటే షకుర్ ఖాన్కు రాజస్థా్న్ మాజీ మంత్రి షేల్ మొహమ్మద్తో మంచి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా వ్యక్తిగత సహాయకుడిగా పని చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో షేల్ మొహమ్మద్ మంత్రిగా పని చేశారు. షకుర్ ఖాన్-షేల్ మొహమ్మద్ గ్రామాలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. మొహమ్మద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేశారు. అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun : గౌరవంగా భావిస్తున్నా.. గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్..
షకుర్ ఖాన్ తరచుగా మొహమ్మద్ తండ్రి ఘాజీ ఫకీర్ను కలిసేవాడని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో షకుర్ ఖాన్, మొహమ్మద్, ఘాజీ ఫకీర్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. ఇక 2021లో ఘాజీ ఫకీర్ మరణించారు.
మే 7న ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జైసల్మేర్పై అధికారులు నిఘా పెట్టినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు. సరిహద్దులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న ఏడో వ్యక్తి షకుర్ ఖాన్ అని వెల్లడించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?