Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు జరుగుతోంది. రెండురోజుల పాటు ప్లీనరీ అంగరంగవైభవంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ.. వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా అన్నారు. వైఎస్ జగన్ మాస్ లీడర్. యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్ను జగన్ చూసుకుంటారని వైఎస్ విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటివరకూ ఆదరించారు. రాజకీయ జీవితంలో మీకు మాత్రమే నేను జవాబు చెప్పాలి.
Flipkart : తగ్గేదేలే అంటున్న ఫ్లిప్కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో వున్నప్పుడు పులివెందుల, కడప ప్రజలు మాతో వున్నారు. ఆయన లేకపోయినా అదే ఆదరణ చూపించారు. నాలో ప్రాణం వున్నంతవరకూ కడప ప్రజలకు రుణపడి వుంటా. రాజశేఖర్ రెడ్డి మనిషి, మనిషిని ప్రేమించారు. తన మనసులో వున్న ఆలోచన అమలుచేశారు. ఆయన ఉన్నా లేకున్నా అవి కొనసాగుతున్నాయి. ఆయనంటే మీకు ఎంతో అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారి మాట ఆదరణ, ఆయన చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ఒక్క రాజకీయనేతను 13 ఏళ్ల పాటు సజీవంగా వుంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డిగారు 35 ఏళ్ళు పనిచేసిన పార్టీని వదిలేశారు. అప్పుడు ఆదరించింది, అక్కున చేర్చుకుంది మీరే అని చెబుతున్నా. జగన్ ఓదార్పుయాత్రకు వస్తే మీరే ఆయన్ని ఓదార్చారు. జగన్ కోసం వచ్చిన వారిని ఆదరించారు. మేం వున్నాం అని టీడీపీ ని ఓడించారు.షర్మిల పాదయాత్రకు పోయేటప్పుడు నాకు భయం వేసింది. ఒక బిడ్డ జైళ్ళో వుంటే.. మరో ఆడబిడ్డ రోడ్డుమీదకు వచ్చింది. ఆమె మూడువేల కిలోమీటర్లు నడిపించింది మీరే అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!