Vijaya Sai Reddy: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని పేర్కొన్నారు.
Read Also: Harish Rao: గొల్ల కురుమలు ధర్మానికి కట్టుబడతారు
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
ఈ సమావేశానికి 225 మంది ప్రతినిధులు హాజరయ్యారని.. 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అందరి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో బీసీ సమావేశాలు నిర్వహించనున్నామని.. నవరత్నాల్లో 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. బీసీలు అంటే చంద్రబాబుకు బానిస క్లాసు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టామని.. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. అందుకోసం ఏ విషయంలో అయినా ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు.
అటు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను బానిసలుగా వాడుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ పరిస్థితిని మార్చారని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహించారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్కు బీసీలంతా అండగా నిలవాలని మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. ఏలూరు బీసీ గర్జన సభలో ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. తాను బీసీనే అయినా, రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో తనకు తెలియదని, కానీ బీసీల్లో 136 కులాలు ఉన్నాయని వెలికితీసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!