Vijaya Sai Reddy: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని పేర్కొన్నారు.
Read Also: Harish Rao: గొల్ల కురుమలు ధర్మానికి కట్టుబడతారు
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ఈ సమావేశానికి 225 మంది ప్రతినిధులు హాజరయ్యారని.. 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అందరి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో బీసీ సమావేశాలు నిర్వహించనున్నామని.. నవరత్నాల్లో 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. బీసీలు అంటే చంద్రబాబుకు బానిస క్లాసు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టామని.. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. అందుకోసం ఏ విషయంలో అయినా ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు.
అటు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను బానిసలుగా వాడుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ పరిస్థితిని మార్చారని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహించారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్కు బీసీలంతా అండగా నిలవాలని మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. ఏలూరు బీసీ గర్జన సభలో ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. తాను బీసీనే అయినా, రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో తనకు తెలియదని, కానీ బీసీల్లో 136 కులాలు ఉన్నాయని వెలికితీసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!