Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు సవాల్.. కాణిపాకంలో నేను ప్రమాణం చేస్తా.. మీరు చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. పరమేశ్వరరెడ్డి అనే సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ను డబ్బులు అడిగానని రాశారని.. ఈ విషయాలపై తాను కాణిపాకంలో ప్రమాణం చేస్తానని.. మీరు చేస్తారా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
Read Also:Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
Also Read
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
గత ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత, శ్రీరామ్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్కు బెంగళూరు, హైదరాబాద్లో పబ్బులు ఉన్నాయని.. కబ్జాలు, దౌర్జన్యాలు మీరే చేస్తారు.. మళ్లీ తమపై నిందలు వేస్తారంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తమకు వెయ్యి కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. ఓ వంద కోట్లు ఇవ్వండి.. ఎక్కడైనా సంతకం చేస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ గెలుస్తాడని కొందరు అమాయకులు రూ.300కోట్లు పందేలు కాసి పోగొట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. ఐ-టీడీపీ నడిపే వాళ్ల మీద కేసు వేస్తానని.. ఆ తర్వాత వెతికి కుక్కను కొట్టినట్లు కొడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనపై ఆరోపించిన విషయాలపై సీబీఐ విచారణకు కోరాలని హితవు పలికారు. టీడీపీ నేతల బొచ్చు పీకాల్సిన తమకేంటని.. తమకు చాలా పనులు ఉన్నాయన్నారు. భార్యను బజారుకీడ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని.. గన్మెన్లు లేకుండా చంద్రబాబు బయటకు తిరగలేరని.. తాను ఐదేళ్లు తిరిగానని గుర్తుచేశారు. నక్సల్స్ పేరుతో వంద మందిని చంపారని.. పరిటాల కుటుంబంపై ఆ ముద్ర ఉందని.. వాళ్ల చరిత్ర గురించి రక్త చరిత్ర అనే సినిమా తీశారని చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
-
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!