Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు సవాల్.. కాణిపాకంలో నేను ప్రమాణం చేస్తా.. మీరు చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. పరమేశ్వరరెడ్డి అనే సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ను డబ్బులు అడిగానని రాశారని.. ఈ విషయాలపై తాను కాణిపాకంలో ప్రమాణం చేస్తానని.. మీరు చేస్తారా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
Read Also:Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
Also Read
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
గత ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత, శ్రీరామ్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్కు బెంగళూరు, హైదరాబాద్లో పబ్బులు ఉన్నాయని.. కబ్జాలు, దౌర్జన్యాలు మీరే చేస్తారు.. మళ్లీ తమపై నిందలు వేస్తారంటూ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తమకు వెయ్యి కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. ఓ వంద కోట్లు ఇవ్వండి.. ఎక్కడైనా సంతకం చేస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ గెలుస్తాడని కొందరు అమాయకులు రూ.300కోట్లు పందేలు కాసి పోగొట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. ఐ-టీడీపీ నడిపే వాళ్ల మీద కేసు వేస్తానని.. ఆ తర్వాత వెతికి కుక్కను కొట్టినట్లు కొడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనపై ఆరోపించిన విషయాలపై సీబీఐ విచారణకు కోరాలని హితవు పలికారు. టీడీపీ నేతల బొచ్చు పీకాల్సిన తమకేంటని.. తమకు చాలా పనులు ఉన్నాయన్నారు. భార్యను బజారుకీడ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని.. గన్మెన్లు లేకుండా చంద్రబాబు బయటకు తిరగలేరని.. తాను ఐదేళ్లు తిరిగానని గుర్తుచేశారు. నక్సల్స్ పేరుతో వంద మందిని చంపారని.. పరిటాల కుటుంబంపై ఆ ముద్ర ఉందని.. వాళ్ల చరిత్ర గురించి రక్త చరిత్ర అనే సినిమా తీశారని చురకలు అంటించారు.
తాజావార్తలు
-
NBK 111 : మనోజ్ విలన్ మాత్రమే కాదు.. అంతకుమించి
-
Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!