Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పామాయిల్ రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఏరియా రెండు వందల మంది ఫామ్ ఆయిల్ రైతులు తెలంగాణ మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సరిహద్దు గ్రామాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. అల్లిపల్లి గ్రామంలొ సమావేశం నిర్వహించారు పామాయిల్ రైతులు. తెలంగాణ ప్రాంతంతో పోల్చితే ఆంధ్రా ప్రాంతంలొ టన్నుకు 3 వేలు రూపాయలు వ్యత్యాసం వుండటంతో చింతలపూడి ఏరియా రైతులు గగ్గోలు పెడుతున్నారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుని ఆశ్రయించిన ఫామ్ అయల్ రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు.
గోద్రేజ్ కంపెని ప్రతినిదులతొ మాట్లాడిన తుమ్మల సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పామాయిల్ రైతులతో తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. సీతానగరం లో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ ఆంధ్రా రైతులకు తెలంగాణ రైతులకు పామాయిల్ ధరలో వ్యత్యాసం చూపిస్తుందని, దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణాలో పామాయిల్ గెలలు ధర నెలకు ముందే ప్రకటిస్తుండగా ఆంధ్రాలోని సీతానగరం పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గెలలు దింపిన నెల రోజుల తర్వాత ధరను ప్రకటిస్తున్నారని చెప్పారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
Read Also: Revanth Reddy : అందరం సర్పంచ్గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలి
దీనివల్ల తమ ఖాతాల్లో ఎంత జమ చేస్తున్నారో తెలియడం లేదని వాపోయారు. గెలలు ఎక్కువగా దిగుమతి అవుతున్న సీజన్ లో ధర తగ్గించి దిగుమతి తగ్గినప్పుడు ధర పెంచుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్న గోద్రేజ్ ఫ్యాక్టరీ పరిధిలో 11 తెలంగాణ మండలాలు ఉన్నాయని ఆ రైతులకు తెలంగాణ ధర ఇచ్చి ఆంధ్రా రైతులకు తక్కువ ధర ఇస్తున్నారని తెలిపారు. తాము ఎక్కువగా వచ్చిన ప్రాంతంలో గెలలు విక్రయించుకునే ప్రయత్నం చేస్తుండగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఒకే ఫ్యాక్టరీలో తెలంగాణ రైతులకు ఒక ధర, ఆంధ్రా రైతులకు మరోధర ఇవ్వడం ఏంటని దానిని పరిష్కరించాలని అధికారులు, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక తాము సహించేది లేదని ఎక్కడ ఎక్కువ ధర ఇస్తే అక్కడే పామాయిల్ గెలలు విక్రయిస్తామని అడ్డుకుంటే తాము వారిపై తిరగబడతామని రైతులు చెప్పారు. దీనిపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి నేను ఉన్నతాధికారులు, నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరో పది రోజులు చూస్తామని సమస్యలు పరిష్కారం చేయకపోతే తాము తెలంగాణ ఫ్యాక్టరీ కే గెలలు తరలిస్తామని రైతులు తెలిపారు.
Read Also: Cotton Prices: ఏనుమామూల మార్కెట్లో పత్తి రైతుల ఆనందం
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!