Pothula Sunitha: ఆయన నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. సారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని.. అయ్యన్న పాత్రుడు వంటి అనేక మంది నాయకుల ద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణ మద్యం వ్యాపారం చేయిస్తున్నారని.. వాళ్లకు మద్యం నుంచి రోజుకు వచ్చే ఆదాయం రోజుకు కోటి రూపాయలు ఉంటుందని ఆరోపించారు. నారా కుటుంబానిది తాగుబోతుల ఫ్యామిలీ అని.. మద్యం మత్తులో అత్తాకోడళ్ళు కొట్టుకున్నారని.. పప్పు నాయుడుకు మగువ, మద్యం లేనిదే రోజు గడవదని విమర్శించారు.
కోతి కల్లు తాగి వ్యవహరించినట్లు కుప్పంలో చంద్రబాబు మాట్లాడటం చూశామని పోతుల సునీత వ్యాఖ్యానించారు. మహిళలు అంటే మర్యాదగా వ్యవహరించటం చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. పవర్ స్టార్ అంటూ తన దత్త పుత్రుడు పేరు, లెజెండ్ అంటూ తన వియ్యంకుడు పేరుతో బ్రాండులను తెచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 200కు పైగా మద్యం బ్రాండులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారించాడని.. తండ్రీ, కొడుకులు ఇద్దరికీ తాగితే కానీ నోరు పెగలదని పోతుల సునీత విమర్శించారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
Read Also: Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
అటు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కూడా నారా కుటుంబంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో B-3 కుంభకోణం జరిగిందని.. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. వైఎస్ భారతిపై టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. పచ్చ కామెర్ల మాదిరిగా బ్రహ్మణి, భువనేశ్వరీలను చూసి టీడీపీ నేతలు భారతమ్మపై విమర్శలు చేస్తున్నారని.. అసలు లిక్కర్ స్కాం వెనుక భువనేశ్వరి దేవి పాత్ర ఉందన్నారు. చంద్రబాబు హయాంలో అతని పేషీలో వ్యక్తి ద్వారా లిక్కర్ కమిషన్ భువనేశ్వరి తీసుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. నారా కుటుంబం కాదు సారా కుటుంబం అని చురకలు అంటించారు. 254 బ్రాండ్లు టీడీపీ హయాంలో వచ్చాయని.. అయ్యన్నకు చెందిన విశాఖ డిస్టలరీ అనుమతులు భువనేశ్వరి ద్వారానే దక్కాయన్నారు. ఆదికేశవులు నాయుడు, యనమల కుటుంబాల డిస్టలరీలు ఎలా వచ్చాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నిలదీశారు. జగన్ హయాంలో అక్రమ మద్యానికి బ్రేక్ పడిందని.. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. వైసీపీకి, సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. దేశంలో బెస్ట్ సీఎంగా భారత్లో మూడో స్థానంలో సీఎం జగన్ ఉన్నారన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ దూరమైన ప్పటి నుంచి జగన్పై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!