కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క జిల్లా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. ఐదుగురు మంత్రులు. ఇది అధికారపార్టీ రచించిన పంచతంత్రం. ఎందుకు అక్కడంత ప్రత్యేకత? స్పెషల్ ఫోకస్ వెనక కారణం.. రెబల్ అభ్యర్థికి చెక్ పెట్టడమేనా?
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు?
Also Read
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారపార్టీ నుంచి స్పెషల్ క్యాంపులు జోరు పెరిగింది. పోలింగ్ జరిగే ఆరింటిలో కరీంనగర్లో జరిగే రెండు స్థానాలపైనే పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ జిల్లాలో మొత్తం 8 వందలకు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, భాను ప్రసాదరావు బరిలో ఉంటే.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ గెలిచేదెవరు? ఎవరికి మూడింది అనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ టు బెంగళూరు.. ఆపై ఏపీలో క్యాంపులు..!
ఎన్నికల పర్యవేక్షణ చేస్తోన్న ఐదుగురు మంత్రులు
రవీందర్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా వెనక్కి తగ్గకపోవడంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించింది. ముందుగా హైదరాబాద్.. ఆ తర్వాత బెంగళూరు.. ఆపై ఆంధ్రప్రదేశ్లో క్యాంపులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారట. అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ తీసుకోకుండా పోలింగ్కు పక్కా వ్యూహం సిద్ధం చేసింది టీఆర్ఎస్. అక్కడి ఎన్నిక కోసం పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు క్యాంపులను పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్లు సైతం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల పనిపైనే ఉన్నారట.
నేరుగా పోలింగ్ రోజునే కరీంనగర్ తీసుకొస్తారా?
ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపుల్లో జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఈ క్యాంపుల్లోనే మాక్ పోలింగ్పై అవగాహన కల్పిస్తున్నట్టు సమాచారం. క్యాంపుల నుంచి తిరిగి రాగానే వారికి మరోసారి ఓటింగ్పై అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. వీరందరినీ పోలింగ్కు ఒకరోజు ముందు కానీ.. లేదా పోలింగ్ రోజున నేరుగా కరీంనగర్ తీసుకెళ్లే ఆలోచనలో నాయకులు ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల వాదన. అయితే ఈ ఎన్నిక కోసం ఏకంగా ఐదుగురు మంత్రులు పార్టీ పర్యవేక్షకులుగా రావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరు కాకుండా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇదే పనిలో ఉన్నారట. వారి నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎటూ జారిపోకుండా చూసుకుంటున్నారట. మరి.. పోలింగ్ నాటికి ఈ పంచతంత్రం ఐదుగురితో సరిపెడతారో.. ఇంకా మరికొందరు మంత్రులను రంగంలోకి దించుతారో చూడాలి.
తాజావార్తలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!