Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Boy Killed Himself After Marriage For Lover: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన తర్వాత తాను ప్రేమించిన యువతిని మర్చిపోలేక.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రేమికుడ్ని కాపాడుకోవడానికి ప్రియురాలు సాయశక్తులా ప్రయత్నించింది కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం ఉక్కునగరానికి చెందిన రుంజల కిరణ్ బాబు (33) ఓ యువతిని ప్రేమించాడు. ప్రియురాలిది అచ్యుతాపురం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా డీప్గా వీళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. కిరణ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి ప్రేమ వ్యవహారం గురించి తెలియదు. దీంతో.. అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. ధైర్యం చాలక.. తన ప్రేమ వ్యవహారాన్ని పేరెంట్స్కి కిరణ్ చెప్పలేకపోయాడు. ఏం చేయలేక వాళ్లు చూపించిన యువతితోనే జనవరి 26న పెళ్లి చేసుకున్నాడు.
Turkey Earthquake : టర్కీ భూకంప నష్టం 342కోట్ల డాలర్లు.. మన కరెన్సీలో ఎంతో తెలుసా?
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
అయితే.. పెళ్లి అయ్యాక తాను ప్రేమించిన యువతిని కిరణ్ మర్చిపోలేకపోయాడు. ప్రతిరోజూ లోలోపలే మదనపడుతూ వచ్చాడు. చివరికి ఆ బాధను భరించలేక.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగేశాడు. అనంతరం తన ప్రియురాలికి ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగేశానని పేర్కొన్నాడు. అది విన్న వెంటనే ప్రియురాలు హటాముటిన ప్రియుడి ఇంటికి చేరుకుంది. అప్పటికే కిరణ్ శరీరంపై ఆ పురుగల మందు తీవ్ర ప్రభావం చూపింది. అతడు కొన ఊపిరితో ఉన్న విషయం గ్రహించి, ప్రియురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే.. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కిరణ్ మృతితో ప్రియురాలు, భార్య, కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy: భూపాలపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిపై టమోటా, గుడ్లతో దాడి
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!