Vizag Metro Rail: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు..
- యూనిక్ డిజైన్తో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్..
- అక్టోబర్లో విశాఖ మెట్రో రైలు పనులు ప్రారంభం..
- ఫస్ట్ ఫేజ్లో 3 కారిడార్లు, 46.63 కి.మీ. నిర్మాణం..
- ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషన్లు ..
- మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్ల అనుసంధానం..
- 20 కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ నిర్మాణం..
- ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Metro Rail: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ యూనిక్ డిజైన్ తో నిర్మాణ పనులకు సిద్ధం అవుతోంది. అక్టోబర్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా… 30 నెలల గరిష్ఠ కాలపరిమితిలో పూర్తి చేయాలని APMRCL నిర్దేశించుకుంది. ఫస్ట్ ఫేజ్ కింద మూడు కారిడార్లు, 46.63 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది. ఎన్ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక కూడళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషనులు ఏర్పాటు కానున్నాయి.
Read Also: Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు
Also Read
విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. సిటీ మీదుగా వెళుతున్న ఓల్డ్ నేషనల్ హైవే నిత్యం రద్దీగా ఉంటోంది. ఏటికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండగా సమస్య జటిలంగా మారుతోంది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. అయితే, మెట్రో రైలు ఏర్పాటు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించి ఆ ప్రయత్నం విరమించారు. కారిడార్ వన్ కింద కొమ్మాది- స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్లో భాగంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్లను అనుసంధానం చేసి ఒకే వంతెనగా నిర్మిస్తారు. గాజువాక – స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి రానుంది. మొత్తంగా 20 కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ వస్తుంది. ఇక్కడ కింద రోడ్డు… దానిపైన నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్లు వాటిపైన మెట్రో ట్రాక్ రానుంది. ఇది పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది.
Read Also: Fake Apple Products: చౌక ధరకే నకిలీ యాపిల్ ప్రాడక్ట్స్.. యాపిల్ ప్రియులే టార్గెట్
మొదటి కారిడార్కు లైన్ క్లియర్ అవ్వగా… గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు వెళ్ళే మార్గంలో అలైన్మెంట్ అభ్యంతరాలు తెరపైకి వస్తున్నాయి. జగదాంబ వంటి ప్రధాన బిజినెస్ సెంటర్ల మీదుగా వెళ్ళే మార్గంలో నిర్మాణాలు, షాపింగ్ ఏరియాల్లో భూ సేకరణ అవసరం అవుతుంది. మొత్తం 100ఎకరాలు అవసరం అవుతుందని తేల్చగా….వీటిలో 10 ఎకరాలు మాత్రం ప్రైవేట్కు చెందినవి. నిబంధనల ప్రకారం భూ సేకరణ చేసి అభివృద్ధి ప్రాజెక్టులో వాళ్ళను భాగస్వామ్యులను చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మెట్రో రైలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన వాటాలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కానుంది. వీఎంఆర్డీఏకు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 1,941.19 ఎకరాల భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రైతుల నుంచి సమీకరించిన భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తారు. మిగిలిన భూములను వీఎంఆర్డీఏ విక్రయిస్తుంది. ఈ ప్రక్రియలో వచ్చిన నిధుల్లో కొంత మెట్రో ప్రాజెక్టుకు కేటాయించనుంది ప్రభుత్వం.
1,941.19 ఎకరాల భూసమీకరణకు వీఎంఆర్డీఏకు అనుమతి..
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!