విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా.. కీలకమైన అలైన్మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది.
AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ. 21,616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ తో నారాయణ భేటీ అయ్యారు..ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు..
ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు.