GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVMC Wards Delimitation: జనాభా పెరుగుతున్న కొద్ది.. వారి అవసరాలు.. పరిపాలన సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వార్డులు, నియోజకవర్గాలు.. ఇలా పునర్విభజన చేస్తూనే ఉంటుంది.. ఇక, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న 98 వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
వార్డుల పునర్విభజనపై గతంలో విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అధికారులు.. ఆ తర్వాత వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది మున్సిపల్ శాఖ.. వార్డు నంబర్ 1 నుంచి 120 వరకు ప్రతి వార్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, గతంలో GVMCలో 98 వార్డులు ఉండగా.. తాజా పునర్విభజనతో GVMC పరిధిలో మొత్తం 120 వార్డులు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
కాగా, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పటికే ఏపీ సర్కార్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు (ULBs), నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసింది.. విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, రామచంద్రపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరులో ఈ నెల 3వ తేదీ నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని గతంలోనే నిర్ణించింది.. ఇక, GVMC, ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలలో ఈ నెల 8వ తేదీ నాటికి వార్డుల విభజన పూర్తి చేయడానికి గడువు విధించింది. మరోవైపు, చిలకలూరిపేట, నెల్లూరు నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 15 అంటే ఇవాళ్టి వరకు పూర్తిచేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టిన విషయం విదితమే..
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!