Tirumala Model Hotel: ఇదేం అరాచకం..? తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.!
- శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్వెజ్ హోటల్..
- తీవ్రస్థాయిలో మండిపడుతోన్న భక్తులు..
- టీటీడీ చైర్మన్, ఈవోకు కిరణ్ రాయల్ ఫిర్యాదు..
- శ్రీవారిపై భక్తితోనే ఏర్పాటు చేశాం అంటున్న నిర్వాహకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Model Hotel: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తారు.. శ్రీవారి గర్భాలయంలో ఒక్కసారి అయినా అడుగుపెడితే చాలు అని భావించేవారు కొందరైతే.. ఏడాది ఓసారి.. నెలకు ఓసారి.. ఇలా రెగ్యులర్గా వెళ్లే భక్తులు కూడా ఉంటారు.. ఇలా నిత్యం తిరుమల గిరులు కళకళలాడుతుంటాయి.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..? తిరుమల వెంకటేశ్వరస్వామి గర్భాలయం నమూనాతో ఓ హోటల్ వెలిసింది.. వెజ్ హోటల్ అయితే, భక్తులు హర్షించేవారేమో.. కానీ, నాన్వెజ్ హోటల్.. తిరుమల కొండను భక్తులు పవిత్రంగా భావిస్తారు.. ఇక, గర్భాలయంలో అడుగుపెట్టి భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు.. ఇప్పుడు శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్వెజ్ హోటల్ పెట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు..
Read Also: Maharashtra: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్.. అధికారిక ప్రకటన మరింత ఆలస్యం..?
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ ఏర్పాటు చేసి.. తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపారాలకు వాడుకుంటున్న వైనం వెలుగు చూసింది.. జయ, విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఆ హోటల్లో ఏర్పాటు చేశారు.. విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్ పేరుతో నిర్వహిస్తోన్న హోటల్లో శ్రీవారి గర్భాలయ నమూనాతో హోటల్ ఉంది.. దీనిపై టీటీడీ ఈవో, చైర్మెన్ కు ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్.. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు, చర్యలు తీసుకోకపోతే హోటల్ వద్ద ఆందోళనకు దిగుతామని కిరణ్ రాయల్ ప్రకటించారు.. ఇలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు కిరణ్ రాయల్..
Read Also: DPL 2025 Auction: డీపీఎల్ 2025 వేలంలో విరాట్ కోహ్లీ కొడుకు!
అయితే, తిరుమలలో వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రాధాన్యత ఎంత ఉంటుందో.. మా ఆంధ్ర రెస్టారెంట్లో కూడా అంత ప్రాధాన్యత ఉంటుందంటున్నారు నిర్వాహకులు.. అయితే, చాలా మంది అడుగుతున్నారు.. వేంకటేశ్వరస్వామిని పెట్టి.. నాన్వెజ్ ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు.. కానీ, ఆ వెంకన్నను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం.. అంతేకాదు, వేంకటేశ్వరస్వామి టెంపుల్ నమూనా ఉన్న ముందు అసలు నాన్వెజ్ను వడ్డించమని చెబుతున్నారు.. చాలా మంది ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతున్నారు.. అక్కడ ఫొటోలు దిగుతున్నారు.. ఇవన్నీ చూస్తే తమకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు నిర్వాహకులు.. ఇప్పుడు ఆ రెస్టారెంట్పై ఫిర్యాదులు వెల్లడంతో.. టీటీడీ ఎలా స్పందిస్తుంది.. నిర్వాహకులు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?