Maharashtra: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్.. అధికారిక ప్రకటన మరింత ఆలస్యం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావంకులే లతోపాటు ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారని తెలిపారు.
Read Also:Anupama Parameshwaran : అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..
Also Read
- Ashwin: "సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
ఇక సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రవీంద్ర చవాన్ రాజకీయ జీవితం యువజన విభాగం కార్యకర్తగా ప్రారంభమైందని.. ఆ తర్వాత కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారన్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడం మాకు గర్వకారణం అని అన్నారు. చంద్రశేఖర్ బావంకులే రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని ఫడ్నవీస్ ప్రశంసించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కృషి ఫలితాల రూపంలో కనిపించిందన్నారు.
థానే జిల్లాకి చెందిన ప్రముఖ నేత అయిన రవీంద్ర చవాన్ 2007లో కాల్యాన్-డోంబివ్లీ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కాంగ్రెస్-ఎన్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. 2009లో డోంబివ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తిరిగి విజయం సాధించి, ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లపై రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. తర్వాత పల్గర్, రాయగడ్ జిల్లాలకు గార్డియన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Read Also:Team India Schedule: ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!
2022లో ఏక్నాథ్ శిండే – ఫడ్నవీస్ సర్కార్ ఏర్పడడంలో ఆయన కీలకమైన వంతు పోషించారు. అదే ఏడాది PWD మంత్రిగా కేబినెట్లో చేరారు. 2024లో డోంబివ్లీ నుంచి నాలుగవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న రవీంద్ర చవాన్ నియామకంతో పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోవొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ashwin: “సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
ట్రెండింగ్
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!