Political Heat in Visakhapatnam: విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్..! కూటమిలో కుదరని ఏకాభిప్రాయం..
- గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం..
- మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో కుదరని ఏకాభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Heat in Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు., క్యాంప్ రాజకీయాలు దేశం దాటేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే.. వైసీపీ తన వర్గాన్ని శ్రీలంకలో మోహరించింది. కమ్యూనిస్టు పార్టీలకు ఇద్దరు సభ్యులు ఉండగా.. అవిశ్వాసం ఓటింగ్ కు దూరంగా ఉంటారని సమాచారం. ఇక, ఈ నెల 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్షలో నెగ్గుతారా..? లేదా..? అనేది అప్పుడు తేలనుంది.. మ్యాజిక్ ఫిగర్ 74 కాగా ఇప్పటికీ కూటమికి రెండు నుంచి మూడు ఓట్లు అవసరం పడనున్నాయి..
Read Also: Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
మొత్తంగా గ్రేటర్ విశాఖలో పొలిటికల్ హీట్ పెరుగుతంది.. మలేషియాలో టీడీపీ.. శ్రీలంకలో వైసీపీ శిబిరాలు ఏర్పాటు చేయగా.. క్యాంప్ రాజకీయాలపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం.. డిప్యూటీ మేయర్ పై కూటమిలో పంచాయితీ తేలకపోవడమే.. అయితే, జనసేన కార్పొరేటర్ల మలేషియా టూర్ కు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.. కానీ, క్యాంప్ కు వెళ్లేందుకు సగం మంది జనసేన కార్పొరేటర్లు అంగీకరించడం లేదు.. ప్రస్తుతం కౌన్సిల్ లో జనసేన పార్టీ బలం 11.. అవిశ్వాస రాజకీయాలకు దూరంగా ఉండాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయం తీసుకున్నారి తెలుస్తుండగా.. ఇప్పుడు గ్రేటర్ విశాఖ పాలిటిక్స్ మాత్రం రంజుగా మారిపోతున్నాయి..
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!