Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. బీచ్లో కూర్చోని టీ తాగడానికి రారు..!
- వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్లో కూర్చుని టీ తాగడానికి రారు..
- వాళ్లకు కావాల్సింది ఎంజాయ్మెంట్ అన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
- నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారు..
- ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలి..
- టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలన్న స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. పర్యాటకులు బీచ్కు వచ్చేదే ఎంజాయ్ చేయడానికి.. కానీ, నిబంధనల పేరుతో వారిని నియంత్రిస్తే ఎవరు వస్తారు? అని ప్రశ్నించారు.. వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్లో కూర్చుని టీ తాగడానికి రారు.. వాళ్లకు కావాల్సింది ఎంజాయ్మెంట్ అన్నారు అయ్యన్నపాత్రుడు.. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన.. ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. టూరిజంకు మినహాయింపులు ఇవ్వాలని పేర్కొన్నారు.. రూల్స్ అవసరమే.. కానీ, కొంత వెసులు బాటు వుండాలన్నారు.. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలి.. ఆఫీసియల్స్ పాజిటివ్ మైండ్తో వుండాలన్నారు.
Read Also: CM Chandrababu: ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
విశాఖలో జరుగుతోన్న పర్యాటక పెట్టుబడుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. మంత్రి కందుల దుర్గేష్తో కలిసి “అరకు చలి ఉత్సవం” బ్రోచర్ విడుదల చేశారు.. పలు కంపెనీలో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి.. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఒప్పందాలు శ్రీకారం చుట్టనున్నాయి.. ఇక, ఈ సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి రాజకీయ నాయకులు ఎవరు..? ఆయన డిప్యూటీ సీఎంపై ప్రజలే నిర్ణయించాలన్నారు.. ఇక, ఇన్వెస్టర్లకు అనుమతి ఇవ్వడానికి ఏడాది కాలం తిరిగాల్సిన అవసరం ఏముంది.. కాలయాపన కారణంగా పెట్టుబడిదారులు వెనక్కిపోతున్నారని.. అప్లికేషన్ వచ్చిన వారం రోజుల్లో రెస్పాన్స్ వచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.. వైజాగ్ లో బీచ్ వాలీబాల్, కబడ్డీ పెట్టాలన్నారు అయ్యన్న పాత్రుడు..
Read Also: Priyanka Chopra: SSMB29 మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటక అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు.. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాకులు వస్తున్నా.. కనీస వసతులు లేవన్న ఆయన.. ఆరేళ్ల క్రితం మొదలు పెట్టిన కాటేజ్ నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు.. ఫ్రీడం ఫైటర్ అల్లూరి స్మారక పార్క్ ను టూరిజంతో అనుసంధానం చేయాలని సూచించారు.. బొజ్జన్న కొండ, అరకు వ్యాలీ వంటి ప్రాంతాలు పూర్తి స్థాయి అభివృద్ధికి నోచుకోవాలి.. పర్యాటక అభివృద్ధిలో ఎందుకు వెనకబడ్డామో పరిశీలించాలని కీలక సూచలను చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!