Vallabhaneni Vamsi Case: వంశీతో ఆయన భార్య పంకజ శ్రీ, పేర్నినాని ములాఖత్.. జైలులో ఇబ్బంది పడుతున్నారు..!
- విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీ మోహన్..
- వంశీతో ఆయన భార్య పంకజ శ్రీ, పేర్ని నాని ములాఖత్..
- కింద పడుకోవడానికి వంశీ ఇబ్బంది పడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించిన ఆయన.. 10వ తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.. 11 వ తేదీ 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వక్తితో ఫిర్యాదు తీసుకొని కేసు పెట్టారు.. 12వ తేదీ సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు.. 12వ తేదీ పెట్టించిన కేసులో 11వ తేదీ కేసు పెట్టిన వ్యక్తి సాక్షి.. అసలు పెట్టిన సెక్షన్లు ఈకేసుతో సంబంధం లేదని ఆరోపించారు.
Also Read
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
ఎస్సీ, ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి కేసు తీసుకొని వెళ్లి విజయవాడ జైల్లో పెట్టారు.. చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టి మరి పోలీసులు యాక్ట్ చేశారని విమర్శించారు పేర్ని నాని.. ఇక, గుంటూరు మిర్చి యార్డ్లో జగన్ పర్యటనలో నేను లేను.. మచిలీపట్నంలో వున్నాను.. మచిలీపట్నంలో మన్సిపల్ కమిషనర్ దగ్గర వున్నాను.. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. పోలీసులే ఒక కేసు సిద్ధం చేసి ఫ్లయింగ్ స్క్వాడ్తో ఫిర్యాదు చేయించారు.. DGPకి లేఖ రాశాను.. మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకి లాగుతాను అన్నారు. మచిలీపట్నంలో వైసీపీ లీడర్స్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ స్వీకరిస్తున్నారు.. రమేష్ హాస్పిటల్ వద్ద 17 మంది కానిస్టేబుల్ తో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి వైసీపీ లీడర్స్ ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, కొల్లు రవీంద్ర మంత్రి పదవికి పనికి రాడు అంటూ ఫైర్ అయ్యారు పేర్నినాని..
Read Also: CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
మరోవైపు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ మాట్లాడుతూ.. కౌంటర్ వేయడానికి వాళ్ల వద్ద మెటీరియల్ లేకపోవడంతో ప్రోలాంగ్ చేస్తున్నారని విమర్శించారు.. పేర్ని నాని, కొడాలి నానిని ములాఖత్కి కుదరదని చెప్పారని తెలిపారు.. ఇక, మాకు రక్షణ కల్పించలేమని.. సీపీ గారు ఒప్పుకోలేదు.. ఈ రోజు కూడా అనుమతి ఇవ్వను అన్నారు.. కొద్ది సేపు వాదన తరువాత ములాఖత్కి పంపించినట్టు వెల్లడించారు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?