Vallabhaneni Vamsi Case: వంశీతో ఆయన భార్య పంకజ శ్రీ, పేర్నినాని ములాఖత్.. జైలులో ఇబ్బంది పడుతున్నారు..!
- విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీ మోహన్..
- వంశీతో ఆయన భార్య పంకజ శ్రీ, పేర్ని నాని ములాఖత్..
- కింద పడుకోవడానికి వంశీ ఇబ్బంది పడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించిన ఆయన.. 10వ తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.. 11 వ తేదీ 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వక్తితో ఫిర్యాదు తీసుకొని కేసు పెట్టారు.. 12వ తేదీ సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు.. 12వ తేదీ పెట్టించిన కేసులో 11వ తేదీ కేసు పెట్టిన వ్యక్తి సాక్షి.. అసలు పెట్టిన సెక్షన్లు ఈకేసుతో సంబంధం లేదని ఆరోపించారు.
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
ఎస్సీ, ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి కేసు తీసుకొని వెళ్లి విజయవాడ జైల్లో పెట్టారు.. చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టి మరి పోలీసులు యాక్ట్ చేశారని విమర్శించారు పేర్ని నాని.. ఇక, గుంటూరు మిర్చి యార్డ్లో జగన్ పర్యటనలో నేను లేను.. మచిలీపట్నంలో వున్నాను.. మచిలీపట్నంలో మన్సిపల్ కమిషనర్ దగ్గర వున్నాను.. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. పోలీసులే ఒక కేసు సిద్ధం చేసి ఫ్లయింగ్ స్క్వాడ్తో ఫిర్యాదు చేయించారు.. DGPకి లేఖ రాశాను.. మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకి లాగుతాను అన్నారు. మచిలీపట్నంలో వైసీపీ లీడర్స్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ స్వీకరిస్తున్నారు.. రమేష్ హాస్పిటల్ వద్ద 17 మంది కానిస్టేబుల్ తో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి వైసీపీ లీడర్స్ ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, కొల్లు రవీంద్ర మంత్రి పదవికి పనికి రాడు అంటూ ఫైర్ అయ్యారు పేర్నినాని..
Read Also: CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
మరోవైపు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ మాట్లాడుతూ.. కౌంటర్ వేయడానికి వాళ్ల వద్ద మెటీరియల్ లేకపోవడంతో ప్రోలాంగ్ చేస్తున్నారని విమర్శించారు.. పేర్ని నాని, కొడాలి నానిని ములాఖత్కి కుదరదని చెప్పారని తెలిపారు.. ఇక, మాకు రక్షణ కల్పించలేమని.. సీపీ గారు ఒప్పుకోలేదు.. ఈ రోజు కూడా అనుమతి ఇవ్వను అన్నారు.. కొద్ది సేపు వాదన తరువాత ములాఖత్కి పంపించినట్టు వెల్లడించారు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.
తాజావార్తలు
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!