Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Comments On Kcr Over Palamuru Rangareddy Project

CM Revanth Reddy : రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..?

Published Date :February 21, 2025 , 5:23 pm
By Gogikar Sai Krishna
  • తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు అన్యాయం జరిగింది
  • గత ఐదేళ్లు పాలమూరు ప్రాజెక్టులు కేసీఆర్‌ ఎందుకు పూర్తి చేయలేదు
  • గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల భిక్షే
  • ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ దోచుకున్నారు
  • పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్‌ చేశారు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన సీఎం, అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ కాలంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉండి ఉంటే, నేటి రోజున ఆంధ్రప్రదేశ్‌తో ఇలాంటి వివాదాలు నెలకొనేవి కావని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామని తెలిపారు. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే, కేసీఆర్ ఓర్వలేక తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ, ఆయనే పదేళ్లు పాలమూరు ప్రాంతాన్ని ఎండబెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Minister Kollu Ravindra: జగన్‌కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దీనిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని స్పష్టంచేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడం ద్వారా కేసీఆర్ పాలమూరు ప్రజలను ఏడాది పాటు గోస పెట్టారని ఆరోపించారు. రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించేందుకు కేసీఆర్ సహకరించాడని, ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలను తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ కేవలం మౌనంగా ఉండిపోయారని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ముందుగా కేటీఆర్, హరీష్ రావు, కవితల అవినీతిని తహతహలాడించాలని సీఎం రేవంత్ సూచించారు. కేటీఆర్ కార్ రేసులో అవినీతికి పాల్పడినప్పటికీ, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజా ధనం దోచుకున్నప్పటికీ, లిక్కర్ కుంభకోణంతో కవిత తెలంగాణ పరువును దిగజార్చినా, కేసీఆర్ మాత్రం వాటిపై స్పందించలేదని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలే శాపంగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక పథకాలను అమలు చేశామని వివరించారు. ఏ గ్రామంలో అయినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అలాగే, ఎనిమిది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి, చారిత్రాత్మక కుల గణనను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Sambhal violence: సంభాల్ అల్లర్లపై యోగీ సర్కార్ ఉక్కుపాదం.. 3000 పేజీల చార్జిషీట్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress government
  • harish rao
  • Kavitha Liquor Scam
  • KCR Failures
  • KTR Corruption

తాజావార్తలు

  • Trump-Kharg Island: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను.. తాజా మాస్టర్ ప్లాన్ ఇదే!

  • Gautam Gambhir: నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు.. విరాట్‌, రోహిత్‌ వివాదంపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!

  • Harish Rao : అసెంబ్లీ వారం రోజులు కూడా నడవదు

  • Salman Khan: సల్మాన్ కొత్త సినిమా టైటిల్ మారింది.. ఏంటో తెలుసా?

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions