Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Private Travel Agencies Are Exploiting Passengers By Increasing Fares During The Sankranti Festival Season

Sankranti 2025: రేట్ ఇంతే! ఇష్టమైతేనే ఎక్కండి..! సీజన్‌లో దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్..

Published Date :January 10, 2025 , 10:51 pm
By Sudhakar Ravula
  • రేట్ ఇంతే! ఇష్టమైతేనే ఎక్కండంటున్న ప్రైవేట్ ట్రావెల్స్..
  • పండుగ సీజన్‌లో దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ ..
  • ఇదేం బాదుడురా భగవంతుడా అంటున్న బీదాబీక్కీ జనం..
  • ప్రైవేట్ బస్సు ఎక్కాలంటేనే జంకే పరిస్థితి..
  • నాలుగైదు రెట్లు పెరిగిన టికెట్ రేట్లు..
  • ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలపై ప్రశ్నించేదెవరని జనం ఆవేదన..
Sankranti 2025: రేట్ ఇంతే! ఇష్టమైతేనే ఎక్కండి..! సీజన్‌లో దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sankranti 2025: సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు. అడిగేవాడు లేడు! ఒకవేళ అడిగినా ఫాయిదా లేదు. సంక్రాంతి లాంటి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ మొదలుపెడతాయి. టికెట్ రేటు నాలుగింతలు పెంచేస్తాయి. భార్య,భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం.. ఏ కాకినాడో, విశాఖో వెళ్లాలంటే ఆస్తులు సమర్పించుకోవాలి. ఇదేం బాదుడురా భగవంతుడా అనుకుంటూ బీదాబీక్కీ బావురుమంటున్నారు.

Read Also: Off The Record: దానం నాగేందర్ ఆగమాగం అవుతున్నారా..?

రైళ్లన్నీ ఫుల్! లగేజీ, పిల్లలతో కలిసి ట్రైన్‌లో నిలబడి పోవడం అసాధ్యం! ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపినా వాటి పరిమితి వాటికుంది! మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్. ఇదొక్కటే కాస్త బెటర్ ఆప్షన్‌. ఈ వీక్‌నెస్సే వాళ్లకు కాసులు కురిపించే వనరుగా మారింది. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి రూ.1200 నుంచి రూ.3500 ఉండే చార్జీలు.. ఇప్పుడు రూ.2500 నుంచి రూ.7 వేల వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే ఏపీ స్లీపర్ బసుల్లో ఒక్కో టికెట్ రూ. 4,239 నుంచి రూ. 6239 వరకు ఉంది. వోల్వోలాంటి బస్సుల్లో అయితే 7వేలకు తక్కువ లేదు. విజయవాడకు గరిష్టంగా 3600 వసూలు చేస్తున్నారు.

Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..

ఆర్టీసీ బస్సులేం తక్కువ తినలేదు. అదనపు చార్జీల పేరుతూ వాళ్లూ బాదుతున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు టీజీ ఆర్టీసీ 6 వేలకు పైగా ప్రత్యేక షటిల్స్ నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు మాగ్జిమం 700 రూపాయలు ఉంటే… ప్రస్తుతం 1,050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో 2,310 చార్జ్ చేస్తున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా చార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా వెబ్సైట్స్ లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా కనీస చర్యలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సమయంలోనైనా ట్రావెల్స్ సంస్థలపై అధికారులు దృష్టి సారిస్తే ఎంతోకొంత వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే పండక్కి ఇంటికి వెళ్లిన సంతోషం కూడా ఉండదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • increasing fares
  • Passengers
  • Private Travels
  • Sankranti 2025

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions