Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..
- పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
- 24 స్టాల్స్ను సందర్శించిన లోకేష్
- ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న మంత్రి
- ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలు ఈ ఫెస్ట్లో చూశాను- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు. స్టాల్స్ పెట్టిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇలాంటి టెక్ ఫెస్ట్ లను మరింతగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ నిర్వాహకులతో చెప్పారు. ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ 2025.
Read Also: Jr- NTR – Balakrishna: అన్స్టాపబుల్ జూ.ఎన్టీఆర్ వివాదం.. అసలు విషయం చెప్పేసిన బాబీ
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ టెక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ టెక్ ఫెస్ట్ ఇక్కడితో ఆగకూడదు.. జీవితంలో ఏదైనా సాధించడానికి ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలని తెలిపారు. క్రికెట్, కారు, బిర్యానీ తనకు నచ్చేవని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలు ఇవాళ ఈ ఫెస్ట్లో చూశానన్నారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన సాంకేతికత ఉందని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా అని ప్రధాని చెప్పిన మాట చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకొక్క జిల్లాకి ఒకొక్క ప్రాధాన్యత ఇచ్చాం.. రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైలట్ ప్రాజెక్టులు చేసేలా విద్యార్ధుల కోసం జీఓ తెస్తామని తెలిపారు. జీఏడీలో కచ్చితంగా టెక్నాలజీ వినియోగించేలా తాను మాట్లాడతానన్నారు. డేర్ టూ డ్రీమ్, స్ట్రైవ్ టూ అచ్చీవ్ అని చంద్రబాబు చెప్పేవారని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV సేఫ్టీ, టెక్ ఫీచర్లు అదుర్స్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!