Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..
- పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
- 24 స్టాల్స్ను సందర్శించిన లోకేష్
- ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న మంత్రి
- ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలు ఈ ఫెస్ట్లో చూశాను- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు. స్టాల్స్ పెట్టిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇలాంటి టెక్ ఫెస్ట్ లను మరింతగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ నిర్వాహకులతో చెప్పారు. ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ 2025.
Read Also: Jr- NTR – Balakrishna: అన్స్టాపబుల్ జూ.ఎన్టీఆర్ వివాదం.. అసలు విషయం చెప్పేసిన బాబీ
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ టెక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ టెక్ ఫెస్ట్ ఇక్కడితో ఆగకూడదు.. జీవితంలో ఏదైనా సాధించడానికి ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలని తెలిపారు. క్రికెట్, కారు, బిర్యానీ తనకు నచ్చేవని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలు ఇవాళ ఈ ఫెస్ట్లో చూశానన్నారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన సాంకేతికత ఉందని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా అని ప్రధాని చెప్పిన మాట చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకొక్క జిల్లాకి ఒకొక్క ప్రాధాన్యత ఇచ్చాం.. రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైలట్ ప్రాజెక్టులు చేసేలా విద్యార్ధుల కోసం జీఓ తెస్తామని తెలిపారు. జీఏడీలో కచ్చితంగా టెక్నాలజీ వినియోగించేలా తాను మాట్లాడతానన్నారు. డేర్ టూ డ్రీమ్, స్ట్రైవ్ టూ అచ్చీవ్ అని చంద్రబాబు చెప్పేవారని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV సేఫ్టీ, టెక్ ఫీచర్లు అదుర్స్..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..