Minister Parthasarathy: అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..! వాళ్లు రాజధానిగా గుర్తించాల్సిన పనిలేదు..
- ఏపీ రాజధాని అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..
- రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయి..
- అమరావతిపై విషం చిమ్మినవారు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి..
- అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు..
- వైసీపీ గుర్తించాల్సిన అవసరం లేదన్న మంత్రి పార్థసారథి..
Minister Parthasarathy: ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు.. ఇక, అమరావతి రీలాంచ్ సభకు వచ్చేందుకు వాహనాలు సరిపోక వేలమంది గ్రామాల్లో ఉండిపోయారని తెలిపారు..
Read Also: Minister Seethakka : గొర్రెల స్కామ్పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
సభలో సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంపై ఆయనకు ఉన్న కమిట్మెంట్ను తెలియజేస్తాయన్నారు పార్థసారథి.. అమరావతి శక్తిని సాక్ష్యాత్తు ప్రధాని మోడీ గుర్తించి కీర్తించారు.. అమరావతి దేవతల రాజధాని అని మోడీ పేర్కొన్నారని గుర్తుచేశారు.. కానీ, అమరావతి భ్రమరావతి అని గత పాలకులు వ్యాఖ్యానించారని మండిపడ్డారు.. గత పాలకులు అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు.. ఇక, అమరావతి సభ సమయంలో అగ్ని ప్రమాదం వెనుక ఎవరైనా ఉంటే దానిపై పోలీసులు విచారణలో గుర్తిస్తారని తెలిపారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు.. వైసీపీ గుర్తించాల్సిన అవసరం లేదు.. గుర్తించాలానే ఆలోచన విధానం వారికి లేదన్నారు.. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారకు.. మరోవైపు.. అమరావతికి చట్ట బద్దత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!