Food Poisoning: విజయవాడలోని మధరసాలో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి..
- విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని మధరసాలో ఫుడ్ పాయిజన్..
- రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు..
- ఫుడ్ పాయిజన్ తో కరిష్మా అనే బాలిక మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
Also Read
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
అయితే, బెజవాడ మదరసా ట్రస్ట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక కరిష్మా అనే బాలిక మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ట్రస్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిన 100 కిలోల బీఫ్, మటన్ మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డీప్ ఫ్రీజ్ లో గడ్డ కట్టిన మాంసం నిల్వలను ఇనుప గునపంతో పొడిచి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. దుర్వాసన వస్తున్న కుళ్లిన మాంసం 15 రోజుల క్రితం నుంచి ఫ్రిజ్ లో ఉంచుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు తరలించారు. అనుమతులు లేని ట్రస్ట్ కి నోటీసులు జారీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు పర్వేజ్ మౌలాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!