Food Poisoning: విజయవాడలోని మధరసాలో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి..
- విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని మధరసాలో ఫుడ్ పాయిజన్..
- రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు..
- ఫుడ్ పాయిజన్ తో కరిష్మా అనే బాలిక మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
అయితే, బెజవాడ మదరసా ట్రస్ట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక కరిష్మా అనే బాలిక మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ట్రస్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిన 100 కిలోల బీఫ్, మటన్ మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డీప్ ఫ్రీజ్ లో గడ్డ కట్టిన మాంసం నిల్వలను ఇనుప గునపంతో పొడిచి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. దుర్వాసన వస్తున్న కుళ్లిన మాంసం 15 రోజుల క్రితం నుంచి ఫ్రిజ్ లో ఉంచుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు తరలించారు. అనుమతులు లేని ట్రస్ట్ కి నోటీసులు జారీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు పర్వేజ్ మౌలాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!