Deputy CM Pawan Kalyan: విజయవాడ బుక్ ఫెస్టివల్ను ప్రారంభించిన పవన్ కల్యాణ్.. పుస్తకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
- 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ..
- విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఫెస్టివల్..
- జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు..
- కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను..
- కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానన్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ను ప్రారంభించారాయన.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు.. కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను.. కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను అంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు..
Read Also: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం.. పుస్తకాలను నా సంపదగా భావిస్తాను అన్నారు పవన్ కల్యాణ్.. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తానన్న ఆయన.. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో అని పేర్కొన్నారు.. నాకు ఏమి కావాలో అది నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడ్డాయి.. రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నిలబడేలా చేశాయన్నారు.. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా.. పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు.. ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం అన్నారు.. తెలుగు సరిగ్గా నేర్చుకొనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా.. స్కూల్ లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.. ఇంగ్లీష్ ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుంది అనడం సరికాదన్నారు.. ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృ బాధ చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Car Price: పెరిగిన కార్ల ధరలు.. ఏయే కంపెనీలు ఎంతేంత పెంచాయో చూద్దామా?
నేను మీకు ప్రాణం అయితే, నాకు పుస్తకాలు అంటే ప్రాణం అన్నారు పవన్.. అంటే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన కారణాల్లో ఒకటి పుస్తకాలు. అందుకే మిమ్మల్ని పుస్తకాలు చదవమనేది.. పుస్తకం నచ్చిందా లేదా అని కాదు. అసలు ఒక పుస్తకంలో ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితలపై గౌరవం కలుగుతుందన్నారు.. పాపులారిటీ ఉన్న ప్రతి వారు గొప్ప వారు కాదు నాతో సహా.. జ్ఞానం ఉన్నవారు, రచయితలు గొప్పవారని పేర్కొన్నారు.. మనం తెలుగు వారీగా పుట్టడం మన అదృష్టం. తెలుగు ఎంత గొప్ప భాష అంటే ఎవరికైనా తేలిగ్గా జ్ఞానోదయం చేసే గొప్ప సాహిత్యం ఉంది అన్నారు.. ఇంటర్ తో చదువు ఆపేసాను కానీ చదవడం ఆపలేదు. చదవడం వల్ల మానసిక శక్తి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!