CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!
- మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..
- వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే చర్యలు..
- తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పిన సీఎం..
CM Chandrababu: మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా… పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు..
Read Also: Siddaramaiah: నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి..?
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఇక, గత ఐదేళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్ వచ్చిందంటూ దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు.. నాకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారన్న ఆయన.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామం.. ఇకపై ఎవ్వరినీ ఊపేక్షించేది లేదు అన్నారు.. అంతేకాదు.. మంత్రులు కూడా సరిగా పనిచేయకపోతే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. కాగా, వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రకటించారు. జక్కంపూడి, సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాలలోకి ఆయన జేసీబీపై వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 అడుగుల లోతు మేర నీళ్లు ఉండడంతో వాహనాలను అక్కడికి పంపడానికి ఇబ్బంది ఏర్పడడంతో.. జేసీబీ వాహనంపై కూర్చుని లోతట్టు ప్రాంతాలలోని ప్రజల కష్టసుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాగునీరు ఆహారం సకాలంలో బాధితులకు అందరికీ అందించాలని అధికారులను ఆదేశించారు… ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మంత్రి వీరాంజనేయులు ముఖ్యమంత్రి వెంట ఉండి పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను దగ్గరుండి వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!