Siddaramaiah: నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి..?
- కర్ణాటకలో కలకలం రేపుతున్న మైసూరు నగరాభివృద్ధి సంస్థ కుంభకోణం..
- తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి..
- ప్రతిపక్షాలు నాపై చేసిన అబద్దాలను రుజువు చేయలేక ఇబ్బంది పడుతున్నాయి: సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ పర్మిషన్ ఇచ్చారు.. దానికి తాను ఆందోళన చెందుతున్నానంటూ విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలంటూ క్వశ్చన్ చేశారు. ప్రతిపక్షాలు అబద్ధాలు సృష్టిస్తున్నారు.. ఇప్పుడు వాటిని నిజమని రుజువు చేయలేక ఇబ్బంది పడుతున్నారు.. నేను ఎప్పుడూ అసత్యం పలకలేదు, ఏ తప్పు చేయలేదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం నాకు లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
Read Also: Transgender love story: ప్రేమలో మోసపోయిన ట్రాన్స్ జెండర్.. 73 మంది అబ్బాయిలపై ప్రతీకారం!
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఇక, ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యపై ట్రయల్ కోర్టు విచారణపై మధ్యంతర స్టేను సెప్టెంబర్ 9 వరకు కర్ణాటక హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో గవర్నర్ థావర్ గహ్లోత్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య వేసిన పిటిషన్పై ఎంక్వైరీని కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా తీసుకుంది. దానికి పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలను ఇచ్చింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ఏరియాలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు ఆరోపించారు.
దీంతో ఈ ఆరోపణలపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ తదితరులు కర్ణాటక గవర్నర్కు కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు ఎంక్వైరికీ ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గవర్నర్ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. తాను సీఎం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్పర్సన్ ఆర్వి దేశ్పాండే చేసిన కామెంట్స్ పై సిద్ధరామయ్య మండిపడ్డారు. ఎవరు సీఎం అవ్వాలనేది శాసనసభ్యులు, హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!