CM Chandrababu: దుబాయ్ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది..
- విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్..
- ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్..
- గత 30 ఏళ్లుగా దుబాయ్ అభివృద్ధిని చూస్తున్నాను..
- దుబాయ్ను చూస్తే నాకు అసూయ కలుగుతోంది: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జనవరిలో అబ్దులా బిన్ ను కలిసాను అప్పుడు ముందుగా ఏపీకి రావలని కోరాను.. ఏపీ గురించి మీకు అప్పుడే అర్థమవుతుందని చెప్పా.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తొలుత ఆంధ్రప్రదేశ్ కే వచ్చారని గుర్తు చేశారు. యూఏఈని ఓ దేశంగా చూస్తే ప్రతి దేశానికి కొన్ని అడ్వంటేజ్స్ ఉంటాయి.. దుబాయ్ ప్రాంతంలో 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా.. ఎడారి ఉన్నా ఆ ప్రాంతాన్ని వారు స్వర్గంలా మార్చారు.. అక్కడి అభివృద్ధిని చూశానన్నారు. ఇక, వారు ఇంటర్నెట్ సిటీ పెడితే, నేను హైటెక్ సిటీ కట్టాను.. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డాం ఆ సమయంలో యూఏఈ ఇస్టోపియాను తీసుకువచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
అయితే, ఢిఫరెంట్ గా ఆలోచిస్తే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 1.1 కోట్ల మంది యూఏఈ జనాభాలో 40 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు.. వారి ద్వారా కూడా యూఏఈలో అభివృద్ధి జరుగుతుంది.. మనకు అక్కడ అవకాశాలు వస్తున్నాయి.. ఇండియాను ఎవ్వరు వ్యాపారపరంగా విస్మరించలేరు.. డెమెగ్రఫిక్ డివిడెంట్ కేవలం ఇండియాకు మాత్రమే ఉంది.. చాలా దేశాలు ఏజింగ్ ప్లాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు.. ఇండియాలో రైట్ టైం రైట్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు.. 2024-25లో 100 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం యూఏఈకి ఇండియాకు మధ్య జరిగింది అన్నారు. గత పదేళ్లగా 11 స్థానం నుంచి 4వ స్థానానికి భారత్ చేరుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్లో పాక్పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
ఇక, 2047కి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది.. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జనవరి 1వ తేదీ నాటికి మొదటి క్వంటం కంప్యూటింగ్ ఏపి నుంచి పని చేస్తుందన్నారు. 575 సర్వీసులు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం.. ఆగష్టు 15 నాటికి ఈ సంఖ్య 100 శాతానికి చేరుతుంది.. మీరు ఇండియాలో పెట్టుబడులు పెడితే అన్ని అనుమతులు ఆన్ లైన్ ద్వారా ఇస్తాం.. మీరు ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది.. రాష్ట్రంలో పేదలను పైకి తెచ్చేందుకు పీ4ను తీసుకువచ్చాం.. 100 తం పేదరిక నిర్మూలను మా లక్ష్యం.. దుబాయ్, యూఏఈ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా బాగా చేశారు.. లులూకు ఎంతో డిమాండ్ ఉంది.. ఆయన నన్ను కొచ్చి వచ్చి షాపింగ్ మాల్ చూడాలిని అడిగారు.. విశాఖతో పాటు విజయవాడ, అమరావతిలో కూడా హైపర్ మాల్ పెట్టాలని అడుగుతున్నాను.. సంపద సృష్టిలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!